ఆమ్ ఆద్మీ పార్టీలో చేరిన మాజీ మిస్ ఇండియా.. !

రాజకీయాల్లోకి అందాల తారలు రావడం కొత్తేమి కాదు.ఇలా వారి అందంతో పార్టీకి ప్రత్యేక ఆకర్షణ తెస్తూ ఓటర్లను ఆకట్టుకున్న వారెందరో ఉన్నారు రాజకీయాల్లో.

 Mansi Sehgel Former Miss India Joins Aam Aadmi Party , Beauty Queen, Mansi Sehga-TeluguStop.com

ఇదిలా ఉండగా ఫెమీనా అందాల పోటీల్లో 2019 వ సంవత్సరంలో మిస్ ఇండియా కిరీటం దక్కించుకున్న ఢిల్లీకి చెందిన మాన్సీ, సీఎం అరవింద్ కేజ్రీవాల్ సిద్ధాంతాలకు ఆకర్షితురాలై, రాజకీయాల్లో ప్రవేశించారు.ఈ విషయాన్ని స్వయంగా మాన్సీ వెల్లడించారు.

కాగా ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో పాఠశాల విద్యను పూర్తి చేసి, నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి బీటెక్ పట్టా అందుకున్న మాజీ మిస్ ఇండియా మాన్సీ సెహ్ గల్, ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో, ఆప్ నేత రాఘవ్ చద్ధా సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రస్తుతం మనం జీవిస్తున్న ప్రపంచంలో స్వచ్ఛమైన రాజకీయాల ద్వారా గణనీయమైన మార్పు తీసుకు రావచ్చని అభిప్రాయపడ్డారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube