నటుడు మనోజ్ బాజ్ పాయ్ గురించి మనందరికీ తెలిసిందే.ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ ద్వారా ఇతను అన్ని వర్గాల ప్రేక్షకులకు చేరువయ్యాడు.
ఇక ఆ వెబ్ సిరీస్ తర్వాత మంచి గుర్తింపు తెచ్చుకున్న మనోజ్ ప్రస్తుతం వివిధ క్రేజీ ప్రాజెక్టులలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్నాడు.ఈ క్రమంలోనే తాను ప్రస్తుతం స్క్రిప్ట్ లను చదవడం మానేశానని మీడియాతో వెల్లడించారు.
ఎందుకంటే తన డేట్స్ 2023 వరకు ఖాళీగా లేవని స్పష్టం చేశారు మనోజ్.మనోజ్ చెప్పినదాన్ని బట్టి చూస్తే అతను సినిమాలో నటిస్తూ ఎంత బిజీగా ఉన్నాడు అర్థం చేసుకోవచ్చు.
మనోజ్ తాజాగా ఒక ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సినిమాల్లో నటించారు.అదేవిధంగా అభిషేక్ చౌబే దర్శకత్వంలో మరొక సినిమాలో కూడా నటిస్తున్నాడు.ఇకపోతే గత ఏడాది డిసెంబర్ లో ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ప్రారంభమయింది.ఇక ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టిన తర్వాత రోజురోజుకీ కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోవడంతో షూటింగ్ కు బ్రేక్ పడింది.
కరోనా కేసులు పెరుగుతుండడంతో షూటింగ్ కు కొన్ని రోజుల పాటు వాయిదా వేశారు.కరోనా కేసులు తగ్గుముఖం పట్టగానే షూటింగ్ ను ప్రారంభిస్తామని దర్శకుడు అభిషేక్ చౌబే మీడియాకు వెల్లడించారు.
ఇక ఈ సినిమాలో మనోజ్ తో పాటుగా కొంకణా సేన్, నాజర్, సాయాజీ షిండే తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.ఇది ఇలా ఉంటే నటుడు మనోజ్ బాజ్ పాయ్ ఇటీవలే మీడియాతో మాట్లాడుతూ.2023 వరకు తన డేట్స్ ఖాళీగా లేవని తెలిపాడు.తన డేట్స్ ఖాళీగా లేకపోవడంతో కొత్త స్క్రిప్ట్ చదవడం కూడా మానేశాను అని చెప్పుకొచ్చాడు.
ప్రస్తుతం తాను నటిస్తున్న సినిమాల షూటింగ్ లు ముగిసిన తర్వాతే కొత్త స్క్రిప్ట్ లను వింటాను అని, ఆ తర్వాతే కొత్త సినిమాలకు సంబంధించిన ఆలోచనలు చేస్తాను అని అతడు చెప్పుకొచ్చాడు మనోజ్ బాజ్ పాయ్.
తాజా వార్తలు