కొంతమంది హీరోయిన్లు తక్కువ సినిమాలే చేసినా అభిమానుల హృదయాలపై చెరిగిపోని ముద్ర వేసుకుంటారు.అలాంటి హీరోయిన్లలో అన్షు ఒకరు కాగా మన్మథుడు సినిమాలో ఆమె పోషించిన మహేశ్వరి పాత్రను అభిమానులు అంత తేలికగా మరిచిపోలేరు.
ఈ సినిమాతో పాటు రాఘవేంద్ర, మిస్సమ్మ సినిమాలలో అన్షు నటించగా తెలుగులో వరుసగా ఆఫర్లు వస్తున్న సమయంలోనే ఈ నటి ఇండస్ట్రీకి దూరమయ్యారు.
పెళ్లి చేసుకుని పిల్లలతో కలిసి అన్షు సంతోషకరమైన జీవనాన్ని సాగిస్తున్నారు.
ఈ బ్యూటీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వనున్నారని వార్తలు వస్తుండగా నిజంగా రీఎంట్రీ ఇస్తున్నారో లేదో తెలియాల్సి ఉంది.అన్షు పిల్లలతో భర్తతో కలిసి దిగిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతుండగా అన్షు పిల్లలు క్యూట్ గా ఉన్నారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
అన్షు పిల్లలు సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తారో లేక ఇండస్ట్రీకి దూరంగా ఉంటారో తెలియాల్సి ఉంది.
స్టార్ హీరోయిన్ స్టేటస్ ను అందుకోకపోయినా కోట్ల సంఖ్యలో అభిమానులను సంపాదించుకున్న ఈ బ్యూటీ తమిళంలో కూడా కొన్ని సినిమాల్లో నటించారు.కొంతమంది హీరోయిన్లు రీఎంట్రీలో వరుసగా ఆఫర్లతో సత్తా చాటుతున్నారు.అన్షు కూడా సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తే బాగుంటుందనే కామెంట్లు అభిమానుల నుంచి వినిపిస్తున్నాయి.
పెళ్లై పిల్లలున్నా అన్షు యంగ్ గానే కనిపిస్తుండటం గమనార్హం.
క్యూట్ క్యూట్ మాటలతో ఫాలోయింగ్ ను పెంచుకున్న ఈ బ్యూటీ గ్లామరస్ రోల్స్ కు దూరంగా ఉంటూ అభిమానులను సొంతం చేసుకున్నారు.అన్షు అంబానీ ప్రస్తుతం వ్యాపారాలతో బిజీగా ఉన్నారని తెలుస్తోంది.అన్షు అంబానీ లండన్ లో జన్మించగా ఆమె సొంతూరు ఢిల్లీ కావడం గమనార్హం.
సచిన్ అనే వ్యక్తిని అన్షు అంబానీ వివాహం చేసుకున్నారు.అన్షు అంబానీ బాల నటిగా కూడా ఒక సినిమాలో నటించగా కొన్ని సినిమాలకు క్యాస్టూమ్ డిజైనర్ గా పని చేశారు.