టాలీవుడ్ నవమన్మథుడు అక్కినేని నాగార్జున నటించిన మన్మథుడు 2 ఆగస్ట్ 9న గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే.ఇక సినిమా బిజినెస్ పనులు కూడా వేగాన్ని అందుకుంటున్నాయి.
టీజర్స్ కి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో చిత్ర యూనిట్ సినిమాపై గట్టి నమ్మకమే పెట్టుకుంది.
అయితే సినిమాకు ఫిక్స్ చేసిన ధరను చూసి బయ్యర్లలో కాస్త ఆందోళన కలుగుతోందని టాక్.ముఖ్యంగా ఓవర్సీస్ లో సినిమాను 1.5కోట్లకు భేరం పట్టినట్లు టాక్.ఇది రిజనబాల్ రేటే అయినప్పటికీ బయ్యర్లు రిస్క్ అని ఎక్కువగా ఆలోచిస్తున్నారట.ఎందుకంటే మన్మథుడు 2 వచ్చిన తరువాత నెక్స్ట్ వారమే సాహో రానుంది.
మూడు భాషల్లో హంగామా చేయనున్న ఆ సినిమాను తట్టుకోవడం కష్టమే.అయితే మొదటివారమే నాగ్ సినిమా పెట్టిన పెట్టుబడిని వెనక్కి తెస్తుందా లేదా అనేది బిగ్ డౌట్.అందుకే బయ్యర్లు ఎటు తేల్చుకోలేకపోతున్నారు.మరి చిత్ర యూనిట్ ఆ డీల్ ను ఎలా క్లోజ్ చేస్తుందో చూడాలి.
తాజా వార్తలు