టాలీవుడ్ లో అడపాదడపా సినిమాల్లో నటిస్తూ పరకాల షోలకి యాంకర్ గా వ్యవహరించేటువంటి తెలుగు అమ్మడు యాంకర్ మంజూష గురించి పెద్దగా చెప్పనవసరం లేదు.అయితే తే చక్కటి ముఖ కవళికలు, అందం అభినయం ఉన్నటువంటి యాంకర్ మంజూష తెలుగులో ఎందుకో అవకాశాలు మాత్రం దక్కించుకోలేక పోతోంది.
అయితే ప్రస్తుతం ఈ అమ్మడు అడపాదడపా అవకాశాలతో కెరియర్ ని నెట్టుకొస్తోంది.
అయితే ఈ అమ్మడు సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులతో అందుబాటులో ఉంటుంది.
అయితే ప్రస్తుతం ఈ అమ్మడు లాక్ డౌన్ కారణంగా ఇంటికే పరిమితమై ఆరోగ్యానికి మంచిదయినటువంటి యోగ మరియు జిమ్ చేస్తూ తీవ్రంగా శ్రమిస్తోంది.అంతేగాక ఆ ఫోటోలను తన అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతాల్లో కూడా షేర్ చేసింది.
అయితే ఈ అమ్మడు షేర్ చేసిన కొద్దిసేపట్లోనే బాగానే లైకులు కామెంట్లు వచ్చాయి.అంతేగాక మరి కొందరు అయితే సినిమాల్లో హీరోయిన్ గా ట్రై చేయొచ్చు కదా అంటూ యాంకర్ మంజూషాకి సలహాలు ఇస్తున్నారు.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ఈ అమ్మడు గతంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించినటువంటి రాఖీ చిత్రంలో హీరో చెల్లెలి పాత్రలో నటించి సినీ విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు అందుకుంది.అయితే ఆ తరువాత అడపాదడపా చిత్రాల్లో నటించినప్పటికీ ఆ పాత్రలకు పెద్దగా ప్రాధాన్యత లేకపోవడంతో యాంకర్ మంజూష గుర్తింపుకు నోచుకోలేక పోయింది.
అయితే ఈ మధ్య కాలంలో వరుస ఫోటో షూట్లతో కొంత గ్లామర్ డోస్ పెంచినట్లు తెలుస్తోంది.అయితే మరి దర్శక నిర్మాతలు అవకాశాల కోసం యాంకర్ మంజూష పడుతున్న టువంటి కష్టాన్ని గుర్తిస్తారో లేదో చూడాలి.