జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన రాఖీ సినిమా గురించి అందరికీ తెలిసిందే.అందులో ఆయన చెల్లి గా నటించిన మంజూష తో మంచి పరిచయమే ఉందని చెప్పాలి.
ఎందుకంటే ఆమె యాంకర్ గా బుల్లితెరలో తన వంతు పాత్ర ను పరిచయం చేసింది కాబట్టి.ఇక ఈమె రాఖీ సినిమా ఎన్టీఆర్ చెల్లిగా మంచి మార్కులే సంపాదించుకుంది.
ఆ తర్వాత కొన్ని సినిమాలలో నటించగా మొత్తానికి యాంకర్ గానే మంచి పేరు సొంతం చేసుకుంది.
ఇక ఈమె సోషల్ మీడియాలో కూడా బాగానే ముందుంటుంది.
ఇక ఒకప్పుడు మంజూష ఎంతో పద్ధతిగా కనిపించడమే కాకుండా, ప్రతి ఒక్క యాంకర్ లలో ఈమెనే మంచి పేరు తెచ్చుకుంది.అంతే కాకుండా తన యాంకరింగ్ తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.
ఇదిలా ఉంటే ఈ మధ్య ఉన్నట్టుండి ఆమె ట్రెడిషనల్ లుక్ కాస్త గ్లామర్ గా మారింది.
ప్రస్తుతం వస్తున్న యాంకర్ లలో ట్రెడిషనల్ లుక్క్ తగ్గిపోయి మొత్తం గ్లామర్ లుక్ రావడంతో పద్ధతి గా కనిపించిన అమ్మాయి మంజూష కాస్త తన లుక్ ని మార్చాలనుకుందో, ఏమోగానీ మొత్తానికి గ్లామర్ గా మారింది.
పొట్టి పొట్టి దుస్తులతో హాట్ ఫోటోలతో షూట్ చేయించుకొని స్టైల్ గా కూర్చొని ఫోటో కు లుక్ ఇస్తుంది.ఈ ఫోటోను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేయగా ప్రస్తుతం వైరల్ గా మారింది.
ఈ ఫోటోలను చూసిన తన అభిమానులు కూడా ఆశ్చర్యపోతున్నారు.మొత్తానికి మంజూష ప్రస్తుతం దూసుకుపోతున్న యాంకర్ల రేంజ్ లను దాటన్నున్నట్లే అనిపిస్తుంది.
ఇదిలా ఉంటే మంజూష యాంకరింగ్ తో పాటు సపోర్టింగ్ క్యారెక్టర్ లో కూడా చేస్తుంది.