అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన సూపర్ హిట్ మూవీ అల వైకుంఠపురంలో.ఈ మూవీలో హీరోయిన్ గా పూజా హెగ్డే నటించగా, హీరో తల్లి పాత్రలో ఒకప్పటి స్టార్ నటి టబు ప్రాధాన్యత ఉన్న రోల్ లో కనిపించింది.
ఇక సుశాంత్ కూడా మరో కీలక పాత్రలో సందడి చేశాడు.అయితే సినిమా మెజారిటీ కథ మొత్తం హీరో, హీరోయిన్ , మురళీశర్మ, హీరో తండ్రి పాత్రల చుట్టూనే తిరుగుతుంది.
ఇదిలా ఉంటే ఇప్పుడు అల్లు అరవింద్ ఈ మూవీని హిందీలో రీమేక్ చేస్తున్నారు.ఇక అల్లు అర్జున్ పాత్ర కోసం కార్తిక్ ఆర్యన్ ని ఫైనల్ చేశారు.
అలాగే పూజా హెగ్డే పాత్ర కోసం కృతి సనన్ ని ఖరారు చేశారు.ఇదిలా ఉంటే ఇప్పుడు హిందీలో టబు పాత్ర కోసం మనీషా కోయిరాలాని కన్ఫర్మ్ చేసినట్లు తెలుస్తుంది.
ఆమె అయితే పాత్రకి పూర్తి న్యాయం చేస్తుందని భావించి ఆమెని ఖరారు చేసినట్లు బోగట్టా.ఇదిలా ఉంటే మిగిలిన పాత్రల కోసం ఎవరిని ఎంపిక చేసారనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది.
ఇక ఈ సినిమా షూటింగ్ ఆగష్టులో స్టార్ట్ చేయాలని నిర్మాత అల్లు అరవింద్ భావిస్తున్నారు.దానికోసం ఇంకా దర్శకుడిని ఖరారు చేయాల్సి ఉంది.ఇదిలా ఉంటే ఈ మూవీతో పాటు అల్లు అరవింద్ జెర్సీ హిందీ రీమేక్ నిర్మాణంలో కూడా భాగస్వామ్యం అయ్యారు.కార్తీక ఆర్యన్ ఈ సినిమా కోసం మరింత స్టైలిష్ గా కనిపించబోతున్నట్లు తెలుస్తుంది.
కృతి సనన్ త్వరలో ఆది పురుష్ షూటింగ్ లో జాయిన్ అవుతుంది.అది ఒక షెడ్యూల్ ఫినిష్ చేసి అల వైకుంఠపురంలో రీమేక్ షూట్ లో జాయిన్ అవుతుందని టాక్.