బీజేపీ, ఆప్ల మద్య హోరా హోరీగా సాగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ విజయం దిశగా దూసుకు పోతుంది.ఈ విజయంను ఎగ్జిట్ పోల్స్ ముందే ఊహించాయి.
కేజ్రీవాల్ ప్రభంజనం మరోసారి కొనసాగడం ఖాయం అంటూ అంతా అన్నారు.అన్నట్లుగానే అక్కడ మళ్లీ ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ పీఠం ఎక్కబోతున్నాడు.
బీజేపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎన్ని హామీలు ఇచ్చినా కూడా ప్రజలు నమ్మలేదు.మూడవ సారి కేజ్రీవాల్కే ఛాన్స్ ఇవ్వాలని వారు భావించారు.
ఎన్నికల్లో వస్తున్న ఈ ఫలితాలపై ఆప్ ముఖ్య నేత మనీశ్ సిసోడియా స్పందించారు.తాము ఎన్నికల ప్రచారంలో భాగంగా విధ్య మరియు వైధ్యం గురించే మాట్లాడం.తాము అధికారంలో ఉన్న సమయంలో విద్య మరియు వైధ్యంపై ఎంతగా దృష్టి పెట్టాం, మళ్లీ అధికారంలోకి వస్తే ఎలాంటి సేవ ఆ రెండు రంగాల్లో అందిస్తాం అంటూ చెప్పాం.కాని ఇతర పార్టీల వారు మాత్రం రెండు మతాల ఎజెండాగా ముందుకు వెళ్లారు.
అందుకే ప్రజలు ఎవరికి ఓటు వేస్తే మేలు జరుగుతుంది అనే విషయాన్ని గుర్తించారు అంటూ ఆయన చెప్పుకొచ్చాడు.