తమిళ స్టార్ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన పొన్నియన్ సెల్వన్ భారీ అంచనాల నడుమ మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.గత కొన్ని సంవత్సరాలుగా ఈ సినిమా గురించి మీడియాలో ప్రచారం జరుగుతుంది.
ముఖ్యంగా గత ఆరు నెలలుగా ఈ సినిమా యొక్క స్థాయిని పెంచే విధంగా తమిళ మీడియాలో కథనాలు వస్తున్నాయి.ఇది ఒక బాహుబలి రేంజ్ సినిమా అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
విక్రమ్, కార్తీ, ఐశ్వర్య రాయ్, త్రిష, జయం రవి.ఇలా ఎంతో మంది స్టార్స్ ఈ చిత్రం లో నటించడం తో అంచనాలు భారీ గా ఉన్నాయి.
తమిళనాడు లో ఈ సినిమా రికార్డు స్థాయి వసూలను సొంతం చేసుకోవడం దాదాపుగా ఖాయం అన్నట్లుగా పరిస్థితి కనిపిస్తోంది.కానీ తెలుగు రాష్ట్రాల్లో ఆ పరిస్థితి లేదనే చెప్పాలి.
మొన్నటి వరకు సినిమా విడుదలకు ముందుకు రానివారు ఇప్పుడిప్పుడే ఆసక్తి చూపిస్తున్నారట.
ప్రముఖ నిర్మాత ఈ సినిమా ను తెలుగు రాష్ట్రాల్లో పంపిణీ చేసేందుకు సిద్ధమయ్యారని వార్తలు వస్తున్నాయి.ఆయన తనకున్న పేరు ప్రతిష్ట లతో దాదాపుగా 580 థియేటర్ల లో ఈ సినిమా ను విడుదల చేయించేందుకు సిద్ధమయ్యాడట.ఇంత భారీ సినిమా కు మినిమంగా 700 నుండి 800 థియేటర్లు దొరికితే బాగుంటుంది.
కానీ టాలీవుడ్ లో ఈ సినిమా కు పెద్దగా అంచనాలు లేని కారణంగా ఈ స్థాయి థియేటర్లు దొరకడమే చాలా గొప్ప విషయం అన్నట్లుగా చర్చించుకుంటున్నారు.ఈ సినిమా కు తెలుగు రాష్ట్రాల్లో 500 మార్కు థియేటర్లో దాటితే చాలు అని తమిళ ఫిల్మ్ మేకర్స్ కూడా భావించారట.
ఇప్పుడు దాదాపు గా 600 థియేటర్ల లో ఈ సినిమా విడుదల కాబోతున్న నేపథ్యం లో చిత్ర యూనిట్ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.మరి ఓపెనింగ్స్ ఎలా ఉంటాయో చూడాలి.
సినిమాకు సంబంధించిన వసూళ్ల విషయంలో ఇప్పటి నుండే చర్చ మొదలు అయ్యింది.మినిమం టాక్ దక్కించుకున్నా కూడా వసూళ్లు వెయ్యి కోట్లు ఉంటాయని అంటున్నారు.
మరి ఏం జరుగుతుందో చూడాలి.