టాలీవుడ్ లో సంగీత దర్శకులు అంటే, కెవి మహదేవన్, చక్రవర్తి, ఇళయరాజా, మణిశర్మ ఇలా ఒక ట్రెండ్ కనిపిస్తుంది.ప్రస్తుతం ట్రెండ్ లో దేవిశ్రీ ప్రసాద్, తమన్ ఉన్నారు.
ప్రతి సంగీత దర్శకుడు కనీసం ఒకటి, రెండు దశాబ్దాల పాటు నెంబర్ వన్ సంగీత దర్శకులుగా తమ హవా కొనసాగించిన వారే.అలా మణిశర్మ కూడా దశాబ్ద కాలం పాటు తన హవా కొనసాగించాడు.
స్టార్ హీరోల సినిమాలకి కేరాఫ్ అడ్రెస్ గా మారిపోయారు.మణిశర్మ అంటే ముందుగా బ్యాగ్రౌండ్ మ్యూజిక్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.
సినిమాలకి బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఇవ్వాలంటే ఇప్పటికి మణిశర్మ పేరే ఎక్కువగా వినిపిస్తుంది.అలాగే అతని పాటలు కూడా సూపర్ హిట్ అయ్యి ట్రెండ్ సృష్టించాయి.
అయితే దేవిశ్రీ ప్రసాద్, తమన్ హవా మొదలైన తర్వాత ఆడియన్స్ మ్యూజిక్ టేస్ట్ మారిన తర్వాత కొంతకాలం పాటు మణిశర్మ వెనక పడ్డారు.
అయితే పూరి జగన్నాథ్ ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మరల ఫామ్ లోకి వచ్చిన మణిశర్మ ఇప్పుడు మళ్ళీ స్పీడ్ పెంచారు.
ప్రస్తుతం ఆయన ఖాతాలో మెగాస్టార్ ఆచార్య, విజయ్ దేవరకొండ ఫైటర్, విక్టరీ వెంకటేష్ నారప్ప, రామ్ హీరోగా నటిస్తున్న రెడ్ సినిమాలతో పాటు, చిన్న సినిమాలు కూడా చాలా ఉన్నాయి.ఈ సినిమాలలు హిట్ అయితే మణిశర్మ హవా మళ్ళీ మొదలవుతుంది.
దేవిశ్రీ ప్రసాద్ ఈ మధ్య కాలంలో సినిమాల సంఖ్య భాగా తగ్గించేశాడు.కేవలం తనకి సన్నిహితులైన సుకుమార్ సినిమాలతో పాటు మెగా హీరోల సినిమాలు ఎక్కువగా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాడు.
దీంతో తమన్ కొంత వరకు స్పీడ్ చూపించిన మణిశర్మని తట్టుకొని నిలబడే కెపాసిటీ అతనికి లేదని అంటున్నారు.మళ్ళీ వరుస అవకాశాలతో ఫుల్ బిజీగా ఉన్న మణిశర్మ టాప్ 5 లోకి ఎంత వరకు వస్తారో వేచి చూడాలి.