మణిరత్నం మల్టీస్టారర్‌ హీరోలు వీరే

మహేష్‌బాబు, నాగార్జునలతో తమిళ స్టార్‌ డైరెక్టర్‌ మణిరత్నం ఒక సినిమాను తెరకెక్కించేందుకు ఏర్పాట్లు చేసిన విషయం తెల్సిందే.కథను కూడా సిద్దం చేసిన తర్వాత ఏం జరిగిందో ఏమో కాని మొదట మహేష్‌బాబు, ఆ తర్వాత నాగార్జున మల్టీస్టారర్‌ నుండి తప్పుకున్నారు.

 Mani Ratnam’s Next With Dulquer-karthi-TeluguStop.com

దాంతో మల్టీస్టారర్‌ లేనట్లే అని తేలిపోయింది.మల్టీస్టారర్‌ గురించి అంతా కూడా మరిచి పోతున్న సమయంలో మరోసారి అదే కథతో వేరే హీరోలతో మల్టీస్టారర్‌ సినిమా చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా అధికారికంగా ప్రకటించాడు.

తమిళ హీరో కార్తీ మరియు మలయాళ హీరో దుల్కర్‌ సల్మాన్‌లతో ఈ మల్టీస్టారర్‌ను తెరకెక్కించాలని మణిరత్నం ఫిక్స్‌ అయ్యాడు.ఇప్పటికే ఈ సినిమా కోసం ఈ ఇద్దరు హీరోలు కూడా డేట్స్‌ ఇచ్చేశారు.

వీరిద్దరికి జోడీగా నిత్యామీనన్‌ మరియు కీర్తి సురేష్‌లను హీరోయిన్స్‌గా ఎంపిక చేశాడు.కథలో స్వల్ప మార్పులు చేసి ప్రస్తుతం స్క్రిప్ట్‌ను రెడీ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

వచ్చే సంవత్సరం ఏప్రిల్‌లో ఈ సినిమాను ప్రారంభిస్తామని మణిరత్నం సన్నిహితులు అంటున్నారు.వచ్చే సంవత్సరం చివర్లో సినిమాను విడుదల చేస్తాను అంటున్నాడు.

తెలుగు మరియు తమిళంలో ఒకే సారి ఈ సినిమాను తెరకెక్కిస్తారట.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube