స్టార్ దర్శకుడు మణిరత్నం చాలా కాలంగా ఓ భారీ బడ్జెట్ సినిమాకి రంగం సిద్ధం చేసుకున్న సంగతి తెలిసిందే.హిస్టోరికల్ డ్రామాగా పోన్నియన్ సెల్వన్ అనే నవల ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించడానికి రెడీ అయ్యారు.
దాని కోసం ముందుగా చాలా మంది పెద్ద స్టార్ లని మణిరత్నం సంప్రదించారు.సూపర్ స్టార్ మహేశ్ బుని కూడా ఈ సినిమా కోసం మణిరత్నం సంప్రదించారని టాక్ వినిపించింది.
ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమా మొదలైనట్లు తెలుస్తుంది.స్టార్ కాస్టింగ్ అయిన విక్రమ్, కార్తి, జయం రవి, ఐశ్వర్య రాయ్, అమితాబచ్చన్ వంటి నటులు ఈ సినిమాలో కీలక పాత్రలు చేస్తున్నారు.
ఈ సినిమాకు సంబంధించిన మొదటి షెడ్యూల్ ను నిర్మాతలు థాయ్ ల్యాండ్ లో ప్లాన్ చేశారని తెలుస్తుంది.షూటింగ్ ఏర్పాట్లు కోసం మణిరత్నం టీమ్ వారం రోజుల క్రితమే థాయ్ ల్యాండ్ కు బయలుదేరి వెళ్లిందట.
దాదాపు 40 రోజుల పాటు ఈ షెడ్యూల్ కొనసాగుతుందని తెలుస్తుంది.ఇక నటీనటులు కూడా షూటింగ్ లొకేషన్ కి వెళ్లిపోయారని సమాచారం.
ఇక ఈ సినిమా షూటింగ్ గురువారం మొదలెట్టారని తెలుస్తుంది.కల్కి కృష్ణమూర్తి రచించిన ‘పోన్నియన్ సెల్వన్’ అనే తమిళ నవల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది.
ఈ సినిమా తనకు డ్రీమ్ ప్రాజెక్ట్ అని గతంలో మణిరత్నం తెలియజేసారు.దీంతో దీనిని ఎంతో ప్రతిష్టాత్మకంగా రకెక్కిస్తున్నారని, వంద కోట్లకి పైగా బడ్జెట్ తో దీనిని నిర్మిస్తున్నారని తెలుస్తుంది.
ఈ చిత్రానికి ఎఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.సంతోష్ శివన్ సినిమాటోగ్రాఫర్.
మద్రాస్ టాకీస్, సన్ పిక్చర్స్ బ్యానర్లు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.