కరోనా పరిస్థితుల కారణంగా గత ఆరు నెలల నుంచి సినిమా షూటింగ్ లు అన్ని కూడా నిలిచిపోయాయి.సెలబ్రెటీల నుంచి సినిమాని నమ్ముకున్న వేల మంది కార్మికులు ఖాళీగా ఉన్నారు.
వీరిలో చాలా మంది ఆర్ధిక ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నారు.ఇదిలా ఉంటే కరోనా లాక్ డౌన్ నిబంధనలు సడలించి ప్రభుత్వం షూటింగ్ లకి అనుమతులు ఇవ్వడంతో ఇప్పుడు ఒక్కొక్కరుగా అందరూ బయటకి వస్తున్నారు.
షూటింగ్ ప్లాన్ చేసుకుంటున్నారు.అవకాశం ఉంటే కొంత మంది విదేశాలలో షూటింగ్ లు చేసుకోవాలని భావిస్తున్నారు.
అయితే పాన్ ఇండియా రేంజ్ లో భారీ కాన్వాస్ పై తెరకెక్కే సినిమాలకి కొంత ఇబ్బందికర పరిస్థితి ఉంది.ఇలాంటి సినిమాలు షూటింగ్ చేయాలంటే వందల మంది పని చేయాలి.
అలాగే జూనియర్ ఆర్టిస్ట్ ల నుంచి స్టార్ ఆర్టిస్ట్ ల వరకు కాంబినేషన్ సన్నివేశాలు ఎక్కువగా ఉంటాయి.ఈ నేపధ్యంలో ఇలాంటి సినిమాలు షూట్ చేయడం కాస్తా ఇబ్బందే అయినా కూడా దర్శకులు వీటిని స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రముఖ దర్శకుడు మణిరత్నం రూపొందిస్తున్న పొన్నియన్ సెల్వం చిత్రం తదుపరి షెడ్యూలు షూటింగును ఈ నెలాఖరు నుంచి నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారు.ఇండియాలో ఈ సినిమా షూటింగ్ కి పరిస్థితులు అంతగా అనుకూలంగా లేకపోవడం వలన కరోనా కేసులు తక్కువగా ఉన్న శ్రీలంకలో షూటింగ్ షెడ్యూల్ ప్లాన్ చేయాలని అనుకుంటున్నారు.
అందుకు తగ్గట్టుగా ప్రస్తుతం ఏర్పాట్లు చేస్తున్నారు.ఐశ్వర్యరాయ్, విక్రం, కార్తి, జయం రవి, త్రిష తదితర స్టార్ క్యాస్టింగ్ ఇందులో నటిస్తున్నారు.మోహన్ బాబు ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు.త్వరలో సినిమా షెడ్యూల్ గురించి ప్రకటించే అవకాశం ఉన్నట్లు టాక్ వినిపిస్తుంది.