ప్రస్తుతం ఏపీలో రాజధాని రచ్చ అధికార, విపక్షాల మధ్య పొలిటికల్ వార్ ని నడిపిస్తుంది.అధికార పార్టీ నేతలు రాజేసిన మంటని విపక్ష పార్టీలు అవకాశంగా వాడుకొని ఎలా అయిన మైలేజ్ సాధించాలని చూస్తున్నాయి.
ఇప్పటికే రాజధాని ఇష్యూని అధికార పార్టీ తనకి అనుకూలంగా మార్చుకొని మూడు ప్రాంతాలలో లబ్ది పొందాలని ప్రయత్నం చేస్తుంది.ఇక టీడీపీ, జనసేన పార్టీలు రాజధాని ఇష్యూని తమకి అనుకూలంగా మార్చుకొని అధికార పార్టీని ఇరుకున పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు.
ఇక ప్రజా సంక్షేమం అనేది పక్కన పెట్టి ఎవరికీ వారు రాజకీయ ఎత్తులతో పార్టీ ప్రయోజనాలు చూసుకుంటున్నారు.
ఇప్పటికే అమరావతిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటించి రాజధాని రైతులకి బాసటగా నిలబడ్డాడు.
ఇక రాజధానిలో పవన్ కళ్యాణ్ చేసిన పాదయాత్రతో అతనికి కొంత మైలేజ్ వచ్చింది.ఇది ఎక్కడ తనకి మైనస్ గా మారుతుందో అని భావించిన చంద్రబాబు పవన్ పర్యటన జరిగిన మరుసటి రోజే రాజధానిలో వాలిపోయి పవన్ కళ్యాణ్ ని వెనకేసుకొచ్చి పరోక్షంగా పవన్ ఇమేజ్ ని మరోసారి డ్యామేజ్ చేసే ప్రయత్నం చేశారు.
ఇదిలా ఉంటె ఈ ఇష్యూ మీద బలంగా పోరాడుతున్న పవన్ కళ్యాణ్ తాజాగా సోషల్ మీడియాలో గతంలో రాజధాని కోసం తాను మాట్లాడిన వీడియో షేర్ చేశారు.రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకి చట్టబద్దత లేకపోతే తరువాత అధికారంలోకి వచ్చే ప్రభుత్వం కారణంగా ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పారు.
ఇప్పుడు ఆ వీడియో షేర్ చేసి తాను గతంలో ఏదైతే అన్నానో అదే జరిగింది అని చెప్పారు.ఈ వీడియోలో జనసేన అభిమానులు సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ చేయడంతో అది కాస్తా వైరల్ అయ్యింది.