మళ్లీ టీడీపీని ఇబ్బంది పెడుతున్న ఆర్కే

మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పదే పదే తెలుగు దేశం పార్టీని ఇబ్బంది పెడుతూనే ఉన్నాడు.మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో నారా లోకేష్‌పై పోటీ చేసి చాలా బలమైన అభ్యర్థిగా నిలిచి ఏకంగా లోకేష్‌ను ఓడించాడు.

 Mangalagiri Allaramakrishna Reddy-TeluguStop.com

దాంతో లోకేష్‌ మొదటి సారి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయినట్లయ్యింది.ఇక ఎప్పటిప్పుడు టీడీపీని టార్గెట్‌ చేస్తూ ఈయన చేస్తున్న విమర్శలు మరియు పెడుతున్న కేసులు ఆ పార్టీని తీవ్రంగా ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి.

గతంలో తెలుగు దేశం ముఖ్య పార్టీ నేతలపై ఆర్కే అక్రమాస్తుల కేసు పెట్టి ఇప్పటికి కోర్టుల చుట్టు తిప్పుతున్న విషయం తెల్సిందే.ఇప్పుడు ఆ పార్టీ ప్రధాన కార్యలయం గురించి ఆర్కే కోర్టుకు ఎక్కాడు.

అమరావతిలోని ఆత్మకూరులో ఉన్న టీడీపీ ప్రధాన కార్యలయం అక్రమ నిర్మాణం అంటూ ఆర్కే హైకోర్టును ఆశ్రయించాడు.అప్పుడు ప్రభుత్వంలో ఉన్న తెలుగు దేశం పార్టీ అధినేత తన పార్టీ కోసం అక్రమంగా మూడు ఎకరాల ఖరీదైన భూమిని 99 సంవత్సరాలకు గాను లీజుకు ఇస్తూ జీవో జారీ చేయడం జరిగింది.

ఆ జీవో చెల్లదంటూ ఇప్పుడు హైకోర్టు తీర్పు ఇవ్వాలంటూ ఆయన డిమాండ్‌ చేస్తున్నాడు.హైకోర్టుకు వెళ్తే తెలుగు దేశం పార్టీ ప్రధాన కార్యలయ నిర్మాణం ఆగిపోయే అవకాశం ఉంది.

స్టే విధించే అవకాశం ఉన్న కారణంగా తెలుగు దేశం పార్టీ నాయకులు టెన్షన్‌ పడుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube