ఇద్దరి మధ్య గొడవ జరుగుతున్నప్పుడు మూడో మనిషి వెళ్ళకూడదు అని పెద్దలు అంటూ ఉంటారు.అది మనుషుల విషయం అయినా,జంతువుల విషయంలో అయినా ఇది నిజమే అని ఈ తాజా ఉదంతం కి సంబందించిన వీడియో చూస్తే అర్ధం అవుతుంది.
ఈ సరదా ఘటన ముంబై లో చోటుచేసుకుంది.రెండు ఆవులు పోట్లాడుకుంటున్న సమయంలో వాటిని విడదీయాలని ఒక వ్యక్తి ప్రయత్నించాడు.
మామూలు గా అయితే ఎవరూ కూడా ఆవుల మధ్య దూరి ఇలాంటి ప్రయత్నం చేయరు కానీ, అతడు తాగిన మత్తులో ఉండడం తో వాటిని ఆపేందుకు ప్రయత్నించాడు.అయితే అప్పటికే మంచి జొర్టు మీద ఉన్న ఒక ఆవు అతడిని సైతం కుమ్మి కిందపడేసింది.
దానితో అతడికి తాగిన మత్తు వదిలినట్లు అయ్యింది.ఈ ఘటనకు సంబందించిన వీడియో ఎవరో రికార్డ్ చేసి సోషల్ మీడియా లో పోస్ట్ చేశారు.ప్రస్తుతం ఈ వీడియో ను చూసి పలువురు నెటిజన్లు నిజంగా ఇద్దరి మధ్య గొడవ జరుగుతున్నప్పుడు మూడో వారు అడ్డం వెళ్ళకూడదు అన్న విషయం అర్ధం చేసుకుంటున్నారు.M
.