సాధారణంగా మనుషులు తలకి ఏదైనా బలమైన దెబ్బ తగలడం వల్ల కానీ, లేదా ఏదైనా పెద్ద ప్రమాదానికి గురవడం వల్ల గాని కోమాలోకి వెళుతుంటారు.కానీ ఓ యువకుడు శాండ్విచ్ తిని ఏకంగా నాలుగు సంవత్సరాలు కోమాలో ఉండి మరణించిన ఘటన జర్మనీలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే ఓ ప్రైవేటు కార్యాలయంలో పని చేస్తున్నటువంటి ఓ యువకుడు తన సహచర ఉద్యోగి అయినటువంటి ఓ వ్యక్తి ఇచ్చేటువంటి శాండ్విచ్ లను తింటుండేవాడు.అయితే ఈ క్రమంలో అతడు ఒక రోజున శాండ్విచ్ తినడం వలన ఫుడ్ పాయిజన్ అయ్యి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు.
ఇది గమనించిన తోటి సహచర ఉద్యోగులు దగ్గరలో ఉన్నటువంటి ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.అయితే వైద్య పరీక్షల అనంతరం ఆ యువకుడు వెళ్ళింది అపస్మారక స్థితిలోకి కాదని కోమాలోకి వెళ్ళాడని నిర్ధారించారు.
దీంతో ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి సహచర ఉద్యోగులు ఖంగుతిన్నారు. దీంతో తాను పని చేస్తున్న యాజమాన్యం ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసి విచారణ చేపట్టాలని కోరారు.
అయితే ఈ విచారణలో భాగంగా పోలీసులు శాండ్విచ్ అమ్మేటువంటి దుకాణదారులు విచారించారు.అయితే ఇందులో వారికి కీలక ఆధారాలు ఏమీ లభించలేదు.కానీ కోమాలోకి వెళ్లినటువంటి వ్యక్తి ఎప్పుడూ శాండ్విచ్ ల కోసం తమ దుకాణానికి రాలేదని చెప్పడంతో పోలీసులు ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు.అంతేగాక ఆ వ్యక్తి తో పాటు పని చేస్తున్నటువంటి కొందరు వ్యక్తులు మాత్రమే తమ దుకాణానికి వచ్చే వాళ్ళని తెలిపారు.
దీంతో పోలీసులు అతడిపై హత్యాయత్నానికి ప్లాన్ చేసినట్టు అనుమానించి ఆ కోణంలో దర్యాప్తు మొదలుపెట్టారు.
ఇందులో భాగంగా తన సహచర ఉద్యోగులను విచారించగా ఉద్యోగి తరచూ షాప్ కి వెళ్లి శాండ్విచ్ కొని తన సహచర ఉద్యోగులకు ఉండేవాడని మరియు ఆ సాండ్విచ్ పదార్థాల్లో కొన్ని రసాయనాలను కలిపి ఇచ్చేవాడని ఆ రసాయనాలు కడుపులో ఉన్నటువంటి కొన్ని రసాయనాలతో కలిస్తే మనిషి మెల్లగా మరణిస్తాడని పోలీసులు నిర్ధారణకు వచ్చారు.
ఇందులో భాగంగా అతడిని అదుపులోకి తీసుకొని విచారించగా ఈ నిజాలు బయట పడినట్లు తెలుస్తోంది.కానీ కోమాలోకి వెళ్లిన టువంటి యువకుడు అప్పటికే మరణించాడు.
దీంతో మరణించిన వ్యక్తి సహ ఉద్యోగి అరెస్ట్ చేసి పోలీసులు రిమాండ్ కి తరలించారు.