టాలీవుడ్ బాక్సాఫీస్ వద్దకు వచ్చే వారం నితిన్ హీరో గా నటించిన మాచర్ల నియోజక వర్గం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.శుక్రవారం రాబోతున్న మాచర్ల నియోజక వర్గంకు పోటీగా అన్నట్లు అదే రోజున నిఖిల్ హీరో గా నటించిన కార్తికేయ 2 సినిమా కూడా విడుదల కాబోతున్న నేపథ్యం లో చిత్ర యూనిట్ సభ్యులు ఒక్క రోజు ఆలస్యంగా కార్తికేయ 2 సినిమా విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చారు.
కార్తికేయ 2 సినిమా విడుదల విషయం లో నిఖిల్ అసంతృప్తితో ఉన్నట్లుగా తెలుస్తోంది, అవతల నిర్మాతలు మరియు డిస్ట్రిబ్యూటర్లు కాస్త ఒత్తిడి చేయడం తో కార్తికేయ 2 సినిమా నిర్మాతలు మరియు డిస్ట్రిబ్యూటర్లు వెనక్కు తగ్గి ఒక రోజు ఆలస్యం గా తమ సినిమా ను విడుదల చేసేందుకు ఓకే చెప్పినట్లు సమాచారం అందుతోంది.
ఈ నేపథ్యం లో నిఖిల్ కాస్త ఘాటుగా స్పందిస్తూ.
ఎప్పుడు మేమే ఎందుకు తగ్గాలి అన్నట్లుగా వ్యాఖ్యలు చేశాడు.ఆ వ్యాఖ్యలు టాలీవుడ్ లో చర్చనీయాంశమయ్యాయి.
నిఖిల్ చేసిన వ్యాఖ్యల పై మంచు విష్ణు సోషల్ మీడియా ద్వారా స్పందించాడు.నిఖిల్ కి మద్దతుగా మంచి సినిమా లు అయితే తప్పకుండా ప్రేక్షకులు వస్తారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అన్నట్లుగా ట్వీట్ చేయడంతో, తనకు మద్దతు ఇచ్చినందుకు కృతజ్ఞతలు అంటూ నిఖిల్ కూడా మళ్లీ ట్వీట్ చేయడం జరిగింది.
వీరిద్దరి ట్వీట్లు సోషల్ మీడియా లో ఒక రకంగా చర్చనీయాంశమయ్యాయి.ఈ విషయం లో మంచు విష్ణు కల్పించుకోవడం లో కొందరు తప్పు పడుతున్నారు.
ఇది ఒక చిన్న విషయం.హీరో నిఖిల్ తన యొక్క ఆవేదనను మాటల రూపంలో వెల్లడించాడు.
అంతే తప్ప ఆయనకు కోపం మరేదైనా లేదు.ఈ విషయం లో నితిన్ మరియు నిఖిల్ ఫ్రెండ్స్ గానే ఉంటారని భావిస్తున్నారు.
కానీ మంచు విష్ణు మధ్యలో వచ్చి కెలకే ప్రయత్నం చేస్తే టాలీవుడ్లో వివాదాలు రాసుకునే అవకాశం ఉందని, మంచు బాబు తన పరిధిలోనే ఉండాలని సోషల్ మీడియా జనాలు సూచిస్తున్నారు.