మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్ష పదవి రేసులో ఈసారి మంచు వారబ్బాయి విష్ణు కూడా నిలబడుతున్న విషయం తెలిసిందే.రెండు నెలలు ఉన్న మా ఎన్నికల కోసం ఇప్పటి నుండే హడావిడి మొదలైంది.
ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు, హేమ, జీవిత రాజశేఖర్, సీవీఎల్ నరసింహా రావు ఎన్నికల బరిలో దిగుతున్నారు.ఈ క్రమంలో ఎవరికి వారు తమ ప్లాన్ ఆఫ్ యాక్షన్ తో రంగంలోకి దిగాలని చూస్తున్నారు.
ప్రకాశ్ రాజ్ మొన్నటివరకు దూకుడుగా ఉన్నారు.తన ప్యానెల్ సభ్యులను ప్రకటించారు.
మా రభస మీద సినీ పెద్దలు సీరియస్ అయినట్టు తెల్సుతుంది.
అందుకే ఇప్పుడు అందరు ఒక్కసారిగా సైలెంట్ అయ్యారు.అయితే లేటెస్ట్ గా మంచు విష్ణు తన ట్విట్టర్ లో ఓ స్పెషల్ వీడియో చేశారు.చెన్నైలో పరిశ్రమ ఉన్నప్పుడు ఆర్టిస్టులంతా నడిగర్ సంఘంలోనే సభ్యత్వం ఉండేదని.
తెలుగు సినీ పరిశ్రమ మా ఏర్పరచిన తర్వాత తెలుగు నటీనటులంతా ఒక్కటయ్యారని.మా అనేది ఒక కుటుంబం.
కొన్నాళ్లుగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కోసం బిల్డింగ్ కోసం ప్రయత్నాలుజరుగుతున్నాయి కాని అది కుదరలేదు.ఇదివరకు తమ కుటుంబం మా బిల్డింగ్ కు కావాల్సిన మొత్తంలో 25 శాతం ఇస్తామని ప్రకటించాము.
కాని ఇప్పుడు మా బిల్డింగ్ ఏర్పాటు చేసే బాధ్యత మొత్తం మా ఫ్యామిలీ తీసుకుంటుందని అన్నారు మంచు విష్ణు.ఇదివరకు చేసిన మా అధ్యక్షులంతా మంచిగా చేశారని.
చిన్న చిన్న పొరపాట్లు జరిగినా అవి ఉద్దేశం పూర్వకంగా చేసి ఉండరని అన్నారు మంచు విష్ణు.ఇక ఫైనల్ గా సినీ పెద్దలంతా కలిసి మా ఎన్నిక ఏకగ్రీవం చేస్తే తాను ఎన్నికల నుండి తప్పుకుంటానని చెప్పారు.
అంతేకాదు మా అధ్యక్షుడిగా తనని ఆశీర్వదించాలని కోరారు మంచు విష్ణు.ప్రస్తుతం మంచు విష్ణు రిలీజ్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.