మా అసోసియేషన్ అధ్యక్ష ఎన్నికలు.కొన్ని రోజుల నుంచి ఇద్దరు ప్యానెల్ ల మధ్య సాగిన విమర్శల తూటాలు అంతా ఇంతా కాదు.
ఒకానొక సందర్భంలో తెలుగు సినీ పరిశ్రమ యుద్ధ వాతావరణాన్ని తలపించింది.పోటా పోటీగా జరిగిన ఈ ఎన్నికల్లో మంచు విష్ణు అత్యధిక ఓట్లు సాధించి అధ్యక్ష పదవిని అధిరోహించారు.
కాగా ఎలక్షన్స్ అనంతరం రామ్ చరణ్ పై మంచు విష్ణు కొన్ని ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు.
రామ్ చరణ్ తనకు మంచి మిత్రుడని హీరో మంచు విష్ణు అన్నారు.
కానీ అతని ఓటు 99% ప్రకాష్ రాజ్ కే వెళ్లిందని తనకు తెలుసని ఆయన అన్నారు.ఎందుకంటే రామ్ చరణ్ వాళ్ల నాన్న మాట జవదాటడు.వాళ్ల నాన్న తీసుకున్న నిర్ణయం పైనే ఆయన కూడా నిలబడతాడని విష్ణు చెప్పుకొచ్చారు.తాను కూడా తన నాన్న నిర్ణయాన్ని గౌరవిస్తానని, అలాగే రామ్ చరణ్ కూడా అని ఆయన అన్నారు.
దానికి నేను ఏం ఫీల్ కావట్లేదని వివరించారు.
ఈ క్రమంలోనే తను మా అధ్యక్ష పదవికి పోటీ చేసిన తర్వాత చిరంజీవి గారు తన తండ్రి మోహన్ బాబుకు ఫోన్ చేసి మా ఎన్నికల పోటీ నుంచి తనని తప్పుకొమ్మని చిరంజీవిగారు చెప్పారని ఈ సందర్భంగా విష్ణు తెలియజేశారు.అలా చిరంజీవి గారు ఫోన్ చేసి చెప్పగానే నాన్న గారు ఈ ఎన్నికలపై శ్రద్ధ చూపారని అందుకోసమే పోటీలో నిలబడి విజయం సాధించామని ఈ సందర్భంగా మంచు విష్ణు ఎన్నికలలో గెలుపొందిన తర్వాత మీడియా సమావేశంలో రామ్ చరణ్, చిరంజీవి గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు.