మరో సారి ఆ '25' శాతం హామీని ఇచ్చిన మంచు విష్ణు.. ఓట్లు పడేనా?

మా ఎన్నికల హడావుడి మొదలు అయ్యింది.సెప్టెంబర్‌ లో ఎన్నికలు జరుగాల్సి ఉంది.

 Manchu Vishnu Promise To Maa Own Building In Maa Elections, Film News, Jeevitha-TeluguStop.com

కరోనా కారణంగా ఎన్నికలు జరుగుతాయా లేదా అనే విషయమై క్లారిటీ లేదు.అయినా కూడా ఎంతో మంది ఈ ఎన్నికల కోసం ముందస్తుగానే సిద్దం అవుతున్నారు.

ప్రకాష్‌ రాజ్‌, మంచు విష్ణు, జీవిత రాజశేఖర్ మరియు హేమ లు మా పీఠం కోసం ఎదురు చూస్తున్నారు.ప్రతి ఒక్కరు కూడా మా ప్రెసిడెంట్ గా మమ్ములను గెలిపిస్తే మా కు ప్రత్యేక భవనం నిర్మిస్తాను అంటూ హామీ ఇస్తున్నారు.

గడచిన పదేళ్లుగా మా కోసం సొంత భవనం కావాలని ప్రతి ఒక్కరు డిమాండ్ చేస్తున్నారు.మా కార్యవర్గం మాత్రం అందుకు సహకరించడం లేదు అనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

ఈ సమయంలోనే మంచు విష్ణ తన నామినేషన్‌ గురించి తెలియజేస్తూ తప్పకుండా తనను ఎన్నుకుంటే ఈసారి మా భవనం కట్టించి తీరుతాను అంటూ హామీ ఇస్తున్నాడు.

గతంలోనే మంచు విష్ణు మా కార్యవర్గం మెంబర్‌ గా పోటీ చేసిన సమయంలో మా భవనం నిర్మాణంకు ఎంత ఖర్చు అయినా కూడా అందులో 25 శాతం వరకు పెట్టుకుంటాము అంటూ హామీ ఇచ్చాడు.

ఈసారి కూడా ఆయన మళ్లీ అదే హామీని ఇస్తున్నాడు.

Telugu Chiranjeevi, Hema, Maa, Manchu Vishnu, Prakash Raj-Movie

ఎన్ని కోట్లు అయినా కూడా అందులో 25 శాతంను ఖర్చు చేసేందుకు మంచు విష్ణు సిద్దం గా ఉన్నాడు కనుక ఇదే మంచి తరుణం అంటూ మా సభ్యులు కొత్త ఆలోచన చేస్తున్నారు.ప్రకాష్‌ రాజ్‌ కు చిరంజీవి మద్దతు ఉందనే వార్తలు వస్తున్నాయి.కనుక మంచు విష్ణు గెలుపుపై అనుమానాలు ఉన్నాయి.

ఇలాంటి సమయంలో ఆయన నుండి 25 శాతం ప్రకటన రావడం తో ఖచ్చితం గా ఆయనకే పాజిటివ్‌ రెస్పాన్స్ వస్తుందని అంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube