కెరియర్ లో వరుస హిట్స్ తో స్టార్ దర్శకుడు రేంజ్ కి వచ్చి ఒక్కసారిగా క్రిందికి పడిపోయిన దర్శకుడు ఎవరంటే వెంటనే శ్రీను వైట్ల పేరు ప్రతి ఒక్కరు చెబుతారు.కమర్షియల్ హీరోయిజంకి, కామెడీ జోడించి కథలు వండిన శ్రీనువైట్ల సినిమాలకి కొంత కాలం పాటు ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టారు.
ఒకే రకమైన కథలని మార్చి మార్చి తీసిన హిట్స్ ఇచ్చారు.అయితే ఆగడు సినిమాతో అతని ఫార్ములా కూడా ఆగిపోయింది.
మరీ శృతిమించిన రొటీన్ కామెడీని ప్రేక్షకులు రిసీవ్ చేసుకోలేక పోయారు.దీంతో ఆగడు రూపంలో చాలా కాలం తర్వాత అతనికి అదిరిపోయే డిజాస్టర్ ఇచ్చారు.
అయితే ఆగడు ఫ్లాప్ అయినా మళ్ళీ అలాంటి ఫార్ములాతోనే బ్రూస్ లీ సినిమా తీసి రామ్ చరణ్ కి కెరియర్ లో ఆరెంజ్ తర్వాత పెద్ద డిజాస్టర్ అందించారు.
ఈ రెండు సినిమాలతో జోనర్ మార్చుకుంటే కొంత వరకు అయినా సేఫ్ జోన్ లో శ్రీను వైట్ల ఉండేవారేమో కానీ మళ్ళీ రవితేజకి అమర్ అక్బర్, అంటోనీ రూపంలో పాత ఫార్ములా కామెడీని ఉపయోగించి దారుణంగా దెబ్బ తిన్నారు.
వరుస హ్యాట్రిక్ డిజాస్టర్ లతో స్టార్ దర్శకులు శ్రీను వైట్లని పూర్తిగా పక్కన పెట్టేసారు.అతను చెప్పే కథలు వినడానికి కూడా సిద్ధంగా లేరు.అయితే శ్రీనువైట్ల కెరియర్ కి బూస్టింగ్ ఇచ్చిన ఢీ సీక్వెల్ ని మంచు విష్ణు కోసం ప్లాన్ చేశాడు.దీనిపై కొద్ది రోజుల క్రితం ఇద్దరి మధ్య చర్చలు కూడా జరిగినట్లు టాక్.
అయితే శ్రీనువైట్ల సిద్ధం చేసిన కథకి మంచు విష్ణు కనెక్ట్ కాలేకపోయాడు.అదే సమయంలో ప్రస్తుతం మోసగాళ్లు అనే పాన్ ఇండియా ప్రాజెక్ట్ ని భారీ బడ్జెట్ తో ప్లాన్ చేశాడు.
ఈ నేపధ్యంలో శ్రీనువైట్లతో రిస్క్ తీసుకోలేనని తరువాత చూద్దాం అని చెప్పి సున్నితంగా మంచు విష్ణు తప్పుకున్నాడని తెలుస్తుంది.ఈ నేపధ్యంలో శ్రీనువైట్ల పరిస్థితి మళ్ళీ మొదటికి వచ్చిందని చెప్పుకుంటున్నారు.