యంగ్ హీరో మంచు విష్ణు నటిస్తున్న తాజా చిత్రం ‘మోసగాళ్లు’ ఇప్పటికే మెజారిటీ శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాను హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కిస్తుండటంతో, ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.
ఇక ఈ సినిమాను తెలుగులోనే కాకుండా ఇంగ్లీష్లో కూడా తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాను హాలీవుడ్లో కూడా రిలీజ్ చేసేందుకు విష్ణు అండ్ టీమ్ ప్లాన్ చేస్తోంది.
కాగా ఈ సినిమాను యూనివర్సల్ సబ్జెక్టుతో హాలీవుడ్ డైరెక్టర్ జెఫ్రీ గీ చిన్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.
ఇక ఈ సినిమాలో ఓ సీక్వెన్స్ హాలీవుడ్ చిత్రాలను కూడా మరిపించడం ఖాయమని చిత్ర యూనిట్ అంటోంది.ముఖ్యంగా ఓ దొంగతానానికి సంబంధించిన సీక్వెన్స్ ఈ సినిమాను మరో లెవెల్కు తీసుకెళ్లనుందని చిత్ర యూనిట్ తెలిపింది.
బాలీవుడ్లోని ధూమ్ సిరీస్లలోని దోపిడీ సీన్స్కు తాతలా ఈ సీక్వెన్స్ ఉండబోతున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది.ప్రపంచంలోనే బిగ్గెస్ట్ ఐటీ స్కామ్ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు చిత్ర వర్గాలు తెలిపాయి.
ఇక ఈ సినిమాలో విష్ణుతో పాటు బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి నటిస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.కాగా అందాల భామ కాజల్ అగర్వాల్ ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తోంది.
ఈ సినిమాతో యూనివర్సల్ గుర్తింపు తెచ్చుకునేందుకు మంచు విష్ణు తెగ ప్రయత్నిస్తున్నాడు.ఈ సినిమాను సంక్రాంతి కానుకగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.
అయితే ఆ సమయంలో బాక్సాఫీస్ వద్ద పెద్ద ఎత్తున పోటీ నెలకొనడంతో మోసగాళ్లు చిత్రం సంక్రాంతి బరిలో దిగుతుందా లేదా అనేది సందేహంగా మారింది.