మంచు విష్ణు నటిస్తున్న లేటెస్ట్ హాలీవుడ్ మూవీ ‘మోసగాళ్లు’ కోసం తెలుగు జనాలతో పాటు ఇతర హాలీవుడ్ చిత్రాల ప్రేమికులు కూడా ఆసక్తిగా చూస్తున్నారు.అయితే ఈ సినిమా భారత్ను ఊపేసిన ఓ అతిపెద్ద ఐటీ స్కాం ఆధారంగా తెరకెక్కుతున్నట్లు చిత్ర యూనిట్ తెలియజేయనుంది.
ఇక ఈ సినిమాలో భారీ తారాగణం కూడా ఉండనుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాల్లో మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.
అయితే ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా అన్ని పనులు నిలిచిపోవడంతో ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా నిలిచిపోయాయి.
ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ను ఇటీవల విష్ణు అనౌన్స్ చేశాడు.మోసగాళ్లు చిత్రాన్ని జూన్ 5న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీగా ఉందని ఆయన తెలిపారు.
తెలుగు వర్షన్ను జూన్ 5న రిలీజ్ చేసి హాలీవుడ్ వర్షన్ సినిమాను జూలైలో రిలీజ్ చేయనున్నట్లు విష్ణు తెలిపారు.
ఇక ఈ సినిమాలో విష్ణుతో పాటు కాజల్, సునీల్ శెట్టి, నవదీప్, రుహానీ శర్మ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఈ సినిమాను జెఫ్రీ చిన్ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు బాగానే క్రియేట్ అవుతున్నాయి.మరి ఈ సినిమా అన్ని వర్షన్లలో ఒకే విధంగా ఉంటుందా లేదా అనేది చూడాలి.