ప్రముఖ నటుడు మంచు విష్ణు తాజాగా అలీతో సరదాగా షోకు హాజరై ఆ షోలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.ఈ మధ్య పేరు బాగా వినిపిస్తుందనే ప్రశ్నకు శ్రీనువైట్లతో చేస్తున్న ఢీ అండ్ ఢీ సినిమా కోసం ఆయన దగ్గర తిట్లు తింటున్నానని విష్ణు అన్నారు.
మీడియాలో తన గురించి వస్తున్న వార్తలపై స్పందిస్తూ ఏదో ఒకర్ రీజన్ తో వార్తల్లో ఉన్నాను కదా అని ఆమె చెప్పుకొచ్చారు.
ఫస్ట్ లాక్ డౌన్ సమయంలో భార్య, పిల్లలు సింగపూర్ లో ఉండిపోయారని సింగపూర్ లో ఉండటం అంటే ఎక్కువ మొత్తంలో ఖర్చవుతుందని విష్ణు అన్నారు.
అసోసియేషన్ వాళ్ల సాయంతో భార్య, పిల్లలను రెస్క్యూ ఫ్లైట్ లో ఇండియాకు తీసుకువచ్చామని విష్ణు అన్నారు.మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్ష పదవికి ఎంపికైతే ఆ పదవికి న్యాయం చేయగలననే నమ్మకం ఉందని ఆ రీజన్ వల్లే తాను నిలబడుతున్నానని విష్ణు చెప్పుకొచ్చారు.
తాను ఎన్ని హిట్లు సాధించినా నాన్న కాలిగోటితో ఆ హిట్లు సమానం కావని విష్ణు అన్నారు.
నటన విషయంలో దేశంలోని 20 మంది లెజెండ్స్ లో నాన్న కూడా ఉంటారని విష్ణు కామెంట్లు చేశారు.నాన్న ఫోన్ చేస్తే కూడా తాను లేచి కూర్చుంటామని పెరిగిన వాతావరణం అలాంటి వాతావరణమని విష్ణు వెల్లడించారు.అమ్మకు మనోజ్ పెట్టే టెన్షన్స్ వల్ల వయస్సు పెరుగుతోందని విష్ణు కామెంట్లు చేశారు.
ముగ్గురిలో అక్కకే కోపం ఎక్కువని నాన్నలో నచ్చిన, నచ్చని అంశం ఆవేశం అని విష్ణు తెలిపారు.గుండెల్లో దాచుకోకుండా నాన్న మాట్లాడతారని కోపంలో అప్పటికప్పుడు మాట అనేస్తారని విష్ణు తెలిపారు.నాన్న విపరీతంగా ప్రేమిస్తారని లేదా విపరీతంగా బాధపడిపోతారని విష్ణు వెల్లడించారు.తాను రాముడిని కాదని రావణుడినని విష్ణు వెల్లడించారు.