మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు అధ్యక్ష పదవికి ఎన్నికై బాధ్యతలు స్వీకరించిన తరువాత సంచలన నిర్ణయాలు తీసుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు.ఈ మధ్య కాలంలో కొన్ని యూట్యూబ్ ఛానెళ్లు హద్దులు దాటి థంబ్ నైల్స్ పెడుతున్న సంగతి తెలిసిందే.
సెలబ్రిటీలకు సంబంధించిన వివాదాల విషయంలో కొన్ని యూట్యూబ్ ఛానెళ్ల నిర్వాహకులు హద్దులు దాటుతున్నారనే విమర్శలు ఉన్నాయి.
ఇలాంటి యూట్యూబ్ ఛానెళ్ల విషయంలో కఠిన చర్యలు తీసుకోవడానికి మంచు విష్ణు సిద్ధమయ్యారు.
హీరోయిన్ల విషయంలో అభ్యంతరకర వీడియోలు పెడితే అస్సలు ఉపేక్షించమని విష్ణు అన్నారు.యూట్యూబ్ ఛానెళ్ల నియంత్రణ కొరకు స్పెషల్ లీగల్ సెల్ ను ఏర్పాటు చేస్తామని మంచు విష్ణు చెప్పుకొచ్చారు.
మంచు విష్ణు వార్నింగ్ తో అభ్యంతరకర వీడియోలు పెడుతున్న యూట్యూబ్ ఛానెళ్ల నిర్వాహకులు మారతారేమో చూడాల్సి ఉంది.
కొన్ని యూట్యూబ్ ఛానెళ్లు విచిత్రమైన టైటిల్స్ ను పెట్టి ప్రేక్షకుల క్రేజ్ ను క్యాష్ చేసుకోవాలనే ప్రయత్నాలు చేస్తున్నాయి.
అలాంటి యూట్యూబ్ ఛానెళ్లకు చెక్ పెట్టే దిశగా మంచు విష్ణు అడుగులు వేస్తున్నారు.సమంత సైతం తన పరువుకు భంగం కలిగించేలా కొన్ని యూట్యూబ్ ఛానెళ్లు వ్యవహరించాయని పేర్కొన్న విషయం తెలిసిందే.
మంచు విష్ణు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మహిళా భద్రత కొరకు కమిటీని ఏర్పాటు చేశారు.
ప్రముఖ సామాజిక కార్యకర్తలలో ఒకరైన సునీతా కృష్ణన్ ఈ కమిటీకి సలహాదారుగా ఉండనున్నారు.విమెన్ ఎంపవర్ మెంట్ ఆండ్ గ్రీవెన్స్ సెల్ పేరుతో ఈ కమిటీ ఏర్పాటవుతోంది.మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో మరింత మంది మహిళలను భాగస్వాముల్ని చేయడం కొరకు కృషి చేస్తున్నానని మంచు విష్ణు చెప్పుకొచ్చారు.
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ను మరింత అభివృద్ధి చేయడానికి మంచు విష్ణు ఎంతగానో శ్రమిస్తున్నారు.