మంచు మోహన్ బాబు కొడుకులుగా సినీ ఇండస్ట్రీకి పరిచయమై తమకంటూ మంచి గుర్తింపును తెచ్చుకున్నారు యంగ్ హీరోలు మంచు విష్ణు, మంచు మనోజ్.అయితే వీరిద్దరూ కూడా సక్సె్స్తో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరించడంలో తమను తాము ప్రూవ్ చేసుకున్నారు.
కాగా ఈ మధ్యకాలంలో మనోజ్, విష్ణు సినిమాలు బాగా తగ్గించారు.
అయితే ప్రస్తుతం మనోజ్ అహం బ్రహ్మాస్మి అనే సినిమాను తెరకెక్కిస్తుండగా, విష్ణు ఓ హాలీవుడ్ సినిమాలో నటిస్తున్నాడు.
అయితే గతంలో వరుసగా హిట్లు అందుకున్న విష్ణు ప్రస్తుతం వరుసగా ఫ్లాపులు చవిచూస్తున్నాడు.అయితే గతంలో ఆయన నటించిన ఓ సినిమా ఖచ్చితంగా ఫ్లాప్ అవుతుందని ముందుగానే ఊహించాడట.
దర్శకుడు నాగేశ్వర్ రెడ్డి తెరకెక్కించిన ఆచారి అమెరికా యాత్ర సినిమా కోసం విష్ణుకు మొదట చెప్పిన కథ ఒకటి, షూటింగ్లో తెరకెక్కించిన కథ వేరే అని మంచు విష్ణు తెలిపాడు.
అయినా తానేమీ చేయలేకపోయినట్లు విష్ణు తెలిపాడు.
ఆ సినిమాలో ఎలాంటి పస లేదని తాను గ్రహించానని విష్ణు చెప్పుకొచ్చాడు.ఇలా తన సినిమా రిలీజ్కు ముందే తెలిసిందనే విషయం గుర్తుకు చేసుకుని ఇప్పుడు బాధపడటం ఎందుకని ప్రేక్షకులు అంటున్నారు.