మా ఎన్నికల్లో అధ్యక్షుడిగా పోటీ చేస్తున్న మంచు విష్ణు ఇటీవల సూపర్ స్టార్ కృష్ణ ను కలిసి ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది.తాజాగా రెబల్ స్టార్ కృష్ణం రాజును కలిసి ఆశీర్వాదం తీసుకున్నాడు.
తన గెలుపుకు ఆశీర్వాదం కావాలంటూ మంచు విష్ణు స్వయంగా వెళ్లి కృష్ణం రాజును కలవడంతో ఆయన సన్నిహితులు ఇండస్ట్రీలో ఉన్న వారు ఖచ్చితంగా ఆయనకు మద్దతు తెలుపుతారని అంతా అనుకున్నారు.కాని ఇక్కడ ఆయన చేసిన తప్పుతో మంచి జరగాల్సింది ఎక్కువ చెడు జరిగేలా కనిపిస్తుంది.
నెట్టింట ఆయన కృష్ణం రాజును కలిసిన ఫొటోను షేర్ చేయడం జరిగింది.ఆ ఫొటో కు గాను ఒరిజినల్ రెబల్ స్టార్ గారిని కలవడం జరిగింది అంటూ మంచు విష్ణు కామెంట్ పెట్టాడు.
ఆ కామెంట్ ను నలుగురు నాలుగు వందల రకాలుగా విశ్లేషిస్తున్నాడు.మంచు విష్ణు ఏ ఉద్దేశ్యంతో పెట్టినా కూడా జనాల్లోకి అది తప్పుడుగా వెళ్లింది.చాలా మంది మంచు విష్ణు ను విమర్శిస్తున్నారు.కృష్ణం రాజు ఒరిజినల్ రెబల్ స్టార్ అయితే ప్రభాస్ ఏంటీ డూప్ అన్నట్లుగా నీ అభిప్రాయమా అంటూ తప్పుబడుతున్నారు.
సోషల్ మీడియాలో ఈ విషయంపై చాలా మంది చాలా రకాలుగా మంచు విష్ణు ను విమర్శిస్తున్నారు.ఇండస్ట్రీలో సక్సెస్ లు ఎలాగూ దక్కలేదు.
కనీసం నీవు నీ సంస్కారంను నిలుపుకుని అందరితో మంచిగా ఉంటే బాగుంటుంది అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
మొత్తానికి ప్రభాస్ అభిమానులతో పాటు అందరు కూడా మంచు విష్ణు చేసిన రియల్ రెబల్ స్టార్ కామెంట్స్ ను తీవ్రంగా తప్పుబడుతున్నారు.ఈ పరిణామాలతో మంచు విష్ణు నుండి రియాక్షన్ ఎలా వస్తుంది అనేది చూడాలి.ప్రస్తుతం ఆయన ఏ విషయంపై ఎక్కువగా స్పందించేందుకు ఆసక్తిగా లేడు.
ఎందుకంటే ఆయన ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడు.ఏం చేసినా కూడా కొన్ని సందర్బాల్లో తప్పుగా పోట్రెట్ అవుతుంది.
అందుకే ఆయన ఈ విషయంలో స్పందించక పోవడం మంచిదని ఆయన ప్యానల్ వారు అంటున్నారు.