ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా ఎంతో అభివృద్ధి చెందడంతో ఎంతోమంది సోషల్ మీడియా వేదికగా నిత్యం నటీ నటుల పై దారుణమైన ట్రోలింగ్ చేస్తూ ఉంటారు.ఈ క్రమంలోనే చాలామంది నటీనటులు ఈ విషయాలను చూసి చూడనట్టు వదిలేయగా మరికొంతమంది వీటి పై స్పందిస్తూ సదరు నెటిజన్లకు గట్టి వార్నింగ్ ఇస్తూ ఉంటారు.
అయితే గత కొద్ది రోజుల నుంచి మంచు కుటుంబం పై ఎక్కువగా ట్రోలర్స్ దాడి చేస్తూ ఉన్నారు.వీరు ఏ విషయం గురించి మాట్లాడినా లేదా సోషల్ మీడియా వేదికగా చిన్న పోస్ట్ చేసిన దాని గురించి పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు.
ఈ క్రమంలోనే మోహన్ బాబు నటించిన సన్ ఆఫ్ ఇండియా సినిమా విడుదలైన తర్వాత ట్రోలర్స్ మరింత రెచ్చిపోతూ వీరి గురించి ఇష్టానుసారంగా నెగిటివ్ కామెంట్లు చేస్తూ ట్రోల్ చేయడంతో మంచు కుటుంబం రంగంలోకి దిగారు.ముఖ్యంగా ఈ కుటుంబంలో మంచు విష్ణు మంచు లక్ష్మీ ప్రసన్న ఏ చిన్న విషయాన్ని మీడియాతో మాట్లాడిన లేదా ట్వీట్ చేసిన వెంటనే పెద్ద ఎత్తున ట్రోల్ చేయడంతో ఏకంగా మంచు మోహన్ బాబు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే ఈ విధంగా తమ కుటుంబం గురించి సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేసే వారికి వీరు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు.ఇప్పటివరకు తమ కుటుంబం గురించి చేసిన ట్రోల్స్ ఇకపై ఆపితే బాగుంటుంది లేదంటే తీవ్రమైన పర్యవసానాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని ఈ విధంగా తమ కుటుంబం గురించి ట్రోల్ చేసే వారిపై పది కోట్ల రూపాయల పరువు నష్టం దావా వేస్తామని మంచు కుటుంబం వెల్లడించారు.మరి తమ గురించి వస్తున్నటువంటి ఈ విధమైన ట్రోల్స్ కు అడ్డుకట్ట వేయాలని భావిస్తున్న మంచు కుటుంబం ఈ విధంగా నెటిజన్లకు వార్నింగ్ ఇచ్చారని తెలుస్తోంది.మరి ఇప్పటికైనా ఈ కుటుంబం గురించి ట్రోల్స్ చేయడం ఆపుతారా లేదా అనేది తెలియాల్సి ఉంది.