ఈ మధ్యకాలంలో పొలిటికల్ కాంట్రవర్సీల్లో ఎక్కువాగా ఎంటర్ అవుతూ కనిపిస్తున్నాడు మంచు మనోజ్.కొద్ది రోజుల క్రితం ఇక నేను తిరుపతి కేంద్రంగా సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నాను అంటూ… ప్రకటించి అందరిలోనూ అనుమానాలు రేకెత్తించాడు.నిజంగా… మంచు మనోజ్ రాజకీయాల్లోకి రాబోతున్నాడా అంటూ పెద్ద చర్చ కూడా జరిగింది.అయితే ఆయన మాత్రం ఈ విషయంలో ఎక్కడా నోరు మెదపడంలేదు కానీ… ట్విట్టర్లో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ.
నెటిజన్లతో ముచ్చటిస్తూ…కనిపిస్తున్నాడు.
తాజాగా మంచు మనోజ్ తన ట్విట్టర్లో చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.భారత ప్రధానమంత్రిని టార్గెట్ చేస్తూ.ఆంధ్రప్రదేశ్ స్పెషల్ స్టేటస్ కోసం ఆయన ఈ ట్వీట్ చేశారు.”పీఎం నరేంద్రమోదీ, ఇన్నాళ్లూ మీరు చేస్తున్న ఫైట్లో మేమంతా మీతోనే ఉన్నాం.మాకు మీరేదో చేస్తారని, మీరిచ్చిన హామీలను నెరవేరుస్తారని.
ఇంతకాలం మిమ్మల్నే సపోర్ట్ చేస్తూ వేచి చూశాం.అయితే స్పెషల్ స్టేటస్ కాదు కదా.కనీసం కృతజ్ఞతాభావం కూడా మీ నుంచి రాలేదు.ఇప్పటికైనా మా డిమాండ్ను గౌరవించి, మా ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వండి.
లేదంటే మీరు ఎవరి సన్నిధిలో అయితే ఆ ప్రమాణం చేశారో.ఆ బాలాజీ ఆగ్రహానికి గురికాకతప్పదు.” అంటూ మంచు మనోజ్ ట్వీట్ చేశారు.