మంచు ఫ్యామిలీ హీరో మంచు మనోజ్ కి కొవిడ్ పాజిటివ్ వచ్చినట్టు తెలుస్తుంది.కొద్దిసేపటి క్రితమే మంచు మనోజ్ ఈ విషయాన్ని తన ట్విట్టర్ ద్వారా వెళ్లడించారు.
తనకు కొవిడ్ పాజిటివ్ వచ్చిందని.ఈ వారం తనని కలిసిన వారంతా కూడా టెస్ట్ చేసుకోవాలని.
తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు మంచు మనోజ్.అంతేకాదు తన గురించి ఏమి బాధపడవద్దని ప్రస్తుతం తను బాగానే ఉన్నానని.
తనకు సపోర్ట్ చేస్తున్న డాక్టర్లు, నర్స్ లకు కృతజ్ఞతలు అని అన్నారు.
మంచు మనోజ్ కి కరోనా అనగానే మనోజ్ ఫ్యాన్స్ షాక్ అయ్యారు.
ఇక సినిమాల విషయానికి వస్తే మనోజ్ ప్రస్తుతం అహం బ్రహ్మస్మి సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాను మనోజ్ తన సొంత బ్యానర్ లో నిర్మిస్తుండగా శ్రీకాంత్ రెడ్డి ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు.
సినిమాలో ప్రియా భవాని శంకర్ హీరోయిన్ గా నటిస్తుంది.సినిమాతో మనోజ్ మళ్లీ తిరిగి ఫాం లోకి రావాలని చూస్తున్నారు.
కొన్నాళ్లుగా వార్తల్లో కూడా లేని మంచు మనోజ్ మళ్లీ కరోనా పాజిటివ్ అని ట్వీట్ చేయడంతో అందరు షాక్ అయ్యారు.మంచు మనోజ్ త్వరగా రికవరీ కావాలని మంచు ఫ్యాన్స్ కోరుతున్నారు.