సైదాబాద్ సింగరేణి కాలనీలో ఆరేళ్ల చిన్నారి చైత్ర పై జరిగిన అత్యాచార ఘటన రెండు తెలుగు రాష్ట్రాలను ఎంతో కృంగదీసింది.ఈ క్రమంలోనే ప్రజానీకం, పోలీసులు నిందితుడి కోసం పెద్దఎత్తున గాలింపు చర్యలు చేపట్టాయి.
ఈ విధంగా నిందితుడి కోసం గాలిస్తున్న సమయంలో గురువారం ఉదయం నిందితుడు రాజు కోణార్క్ ఎక్స్ప్రెస్ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు.ఈ విధంగా రాజు ఆత్మహత్య చేసుకున్నాడన్న విషయం తెలియడంతో చిన్నారి చైత్ర విషయంలో ముందు నుంచి ఎంతో వైల్డ్ గా రియాక్ట్ అవుతున్నటువంటి హీరో మంచు మనోజ్ స్పందిస్తూ ఒక వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ సందర్భంగా మంచు మనోజ్ మాట్లాడుతూ.
అందరికీ నమస్కారం.ఆ రాక్షసుడికి ఇలా కావాల్సిందే.
ఇలాంటి నీచమైన పనులు చేసిన ఎవరికైనా ఇదే శిక్ష పడుతుంది.చైత్ర తల్లి నువ్వు ఎక్కడున్నా నీ ఆత్మ శాంతించాలని ఆ పరమేశ్వరుని కోరుకుంటున్నా అంటూ తెలిపారు.
ఈ సంఘటన తర్వాత చిన్నారి తల్లిదండ్రులకు, తెలుగు రాష్ట్రాల ప్రజలకు కొద్దిగా ఉపశమనం కలిగి ఉంటుంది.అయినా మనం ఏం చేసినా ఆ చిన్నారి తల్లిని తీసుకురాలేము.
ఈ సంఘటన తర్వాత ప్రతి ఒక్కతల్లి తండ్రికి ఎంతో భరోసా వుంటుంది.ఆడపిల్ల పట్ల ఎవరైనా ఇలా తప్పుగా ప్రవర్తిస్తే పోలీసులు, ఉద్యోగులు, ప్రజానీకం ముందుకు వచ్చి తనకు న్యాయం జరిగేలా చేస్తుందన్న భరోసా ప్రతి ఒక్క ఆడపిల్ల తల్లిదండ్రులకి కలుగుతుందని తెలిపారు.
ఇలాంటి సంఘటనలు మరోసారి పునరావృతం కాకుండా ఉండాలంటే పిల్లలకు చిన్నప్పుడే ఏది మంచి.ఏది చెడు అనే విషయాలను తల్లిదండ్రులు తెలియజేయాలని మానవాళి తలదించుకునేలా ఇలాంటి పనులు ఇంకొకసారి పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క తల్లి తండ్రికి ఉందంటూ ఈ వీడియో ద్వారా తెలిపారు.అమ్మాయిల విషయంలో కేవలం గవర్నమెంట్, పోలీసులే కాకుండా ప్రతిఒక్క పౌరుడు బాధ్యతగా వ్యవహరిస్తే ఈ విధమైనటువంటి సమస్యలు ఇక పై రావని, అందరం కలిసికట్టుగా బాధ్యతలు తీసుకుంటే ఇలాంటి సంఘటనలు జరగవని.చిన్నారి చైత్ర విషయంలో సాయం చేసిన ప్రతి ఒక్కరికి పాదాభివందనం అంటూ మంచు మనోజ్ వీడియో ద్వారా తెలియజేశారు.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.