తెలుగు సినీ ప్రేక్షకులకు హీరో మంచు మనోజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.టాలీవుడ్ సీనియర్ హీరో నటుడు మోహన్ బాబు తనయుడిగా ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన మంచు మనోజ్ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నాడు.
మొదట దొంగ దొంగది సినిమాతో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.ఇక తెలుగులో బిందాస్, పోటుగాడు,వేదం వంటి సినిమాలలో నటించి హీరోగా ప్రేక్షకులను అలరించాడు.
కాగా హీరోగా మంచు మనోజ్ చాలా తక్కువ సినిమాల్లో నటించాడు.ఇది ఇలా ఉంటే మనోజ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి 18 ఏళ్ళు పూర్తి అయ్యింది.
ఈ సందర్భంగా కృతజ్ఞతలు చెబుతూ తాజాగా సోషల్ మీడియాలో తన అభిమానులతో ఒక లేఖను పంచుకున్నాడు మంచు మనోజ్.
కాగా మంచు మనోజ్ నటించిన దొంగ దొంగది సినిమా విడుదల అయ్యి 18 ఏళ్లు పూర్తి అవుతున్న సందర్భంగా ట్విట్టర్ లో ఒక భావోద్వేగ లేఖను రాసుకొచ్చాడు.
మీ ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు.తెలుగు సినీ ఇండస్ట్రీకి నేను ఎంట్రీ ఇచ్చి 18 ఏళ్లు పూర్తి అయ్యింది.నాకు ఈ సినీ ప్రయాణం చాలా ప్రత్యేకమైనది.ఇక ప్రేక్షకులకు, నిర్మాతలకు,దర్శకులకు, టెక్నీషియన్స్ కు, సహనటులకు మీడియాకు నా కృతజ్ఞతలు.
మీరు నాపై చూపించిన ప్రేమ అభిమానాలతో నేను నేడు ఈ స్థాయిలో ఉన్నాను.నా మొదటి సినిమా నిర్మాత ఎన్వి ప్రసాద్ గారు అశోక్ గారికి ధన్యవాదాలు.
వారు నా మీద పెట్టిన నమ్మకంతోనే ఇండస్ట్రీలో నేను నిలదొక్కుకోగలిగాను.నా మొదటి సినిమా దొంగ దొంగది నాకు చాలా నాకు ప్రత్యేకమైన చిత్రం.
సుబ్రహ్మణ్యం గారు అజయ్ విన్సెంట్ గారికి థాంక్యూ.నేను సినిమాలకు చాలా కాలంగా దూరంగా ఉన్నానని నాకు తెలుసు.కానీ ఇది తప్పనిసరిగా తీసుకోవాల్సిన విరామం.అయితే మీరందరూ ఇచ్చిన ఆశీర్వాదాలతో త్వరలోనే మీ ముందుకు వస్తానని వాగ్దానం చేస్తున్నాను అంటూ ఒక సుదీర్ఘమైన పోస్టుని రాసుకొచ్చాడు మంచు మనోజ్.
ఇకపోతే మంచు మనోజ్ వ్యక్తిగత విషయానికి వస్తే హైదరాబాద్ కు చెందిన ప్రణీత రెడ్డి ని 2015లో మనోజ్ పెళ్లి చేసుకున్నాడు.ఆ తర్వాత వారిద్దరికీ వ్యక్తిగత జీవితంలో మనస్పర్ధలు రావడంతో ఇరువురి అంగీకారంతో 2019లో విడాకులు తీసుకుని విడిపోయారు.ఇకపోతే మంచు మనోజ్ ప్రస్తుతం సినిమాలో నటిస్తున్నాడు.కాగా మంచు మనోజ్ ట్విట్టర్లు రాసుకొచ్చిన సుదీర్ఘమైన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.