టాలీవుడ్ లో ఏదో ఒక సంఘటనతో ఎప్పుడు వార్తల్లో నిలిచే కుటుంబం మంచు వారి కుటుంబం , మోహన్ బాబు తో మొదలు కొని విష్ణు , లక్ష్మీ మంచు , మనోజ్ లు ఏదో సంఘటనతో సోషల్ మీడియా లో ట్రోల్ అవుతూ ఉంటారు కానీ ఆ కుటుంబం ఆ ట్రోల్స్ ని కూడా చాలా సరదాగా తీసుకుంటుంది.ఇప్పుడు ఆ కుటుంబం పేరు మళ్ళీ సోషల్ మీడియా లో గట్టిగా వినిపిస్తుంది దానికి కారణం మంచు మనోజ్.
మార్చ్ 19 , మోహన్ బాబు గారు 69 వ ఏటా అడుగుపెడుతున్న సందర్భం లో మంచు వారి చిన్నబ్బాయి మంచు మనోజ్ ఒక చిన్న పిల్లని దత్తత తీసుకొని గొప్ప మనసు చాటుకున్నాడు.వివరాల్లోకి వెళితే సిరిసిల్ల కి చెందిన అశ్విత అనే పాపని మంచు మనోజ్ ఈ రోజు దత్తత తీసుకుంటున్నాను అని అధికారికంగా తన సోషల్ మీడియా ఫేస్బుక్ లో పోస్ట్ చేసాడు అంతే కాదు తిరుపతి లో ఉన్న వారి శ్రీ విద్య నికేథన్ ఇంటర్నేషనల్ స్కూల్ లో అడ్మిషన్ కూడా తీసుకున్నాడు
ఆమె ని పెద్ద చేసి I.A.S( ఐ.ఏ.ఎస్ ) చేయడమే తన లక్ష్యం అని మంచు మనోజ్ పోస్ట్ చేసాడు.తన సంరక్షణ భద్రత బాధ్యత అన్ని తనవే అని ఆయన పేర్కొన్నారు.ఈ ఒక్క సంఘటనతో సోషల్ మీడియా లో మళ్ళీ అంన్చు కుటుంబం వైరల్ అయింది.
మంచు వారు కుటుంబ సభ్యులు మంచు వారే కాదు మంచి వారు కూడా అని నెటిజన్లు ప్రశంశల వర్షం కురిపిస్తున్నారు , ఎంతైనా మంచు మనోజ్ తీసుకున్న నిర్ణయం చాలా గొప్పది వారికి తెలుగుస్టాప్ నుండి అభినందనలు.