వరుస అవకాశాలతో టాలీవుడ్ ఇండస్ట్రీలో బిజీగా ఉన్న కాజల్ అగర్వాల్ గత నెలలో ముంబైకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ కిచ్లును వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.కరోనా వైరస్ విజృంభణ, లాక్ డౌన్ నిబంధనల నేపథ్యంలో పరిమిత సంఖ్యలో బంధుమిత్రుల మధ్య వివాహ వేడుక జరిగింది.
కాజల్, గౌతమ్ మాల్దీవులకు హనీమూన్ కు వెళ్లగా అక్కడ దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ప్రస్తుతం మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తున్న కాజల్ వచ్చే నెల నుంచి షూటింగుల్లో పాల్గొనబోతున్నారు.
అయితే కరోనా వల్ల సినిమా ఇండస్ట్రీలోని సెలబ్రిటీలకు కాజల్ పార్టీ ఇవ్వలేదు.కాజల్ పార్టీ ఇవ్వకపోవడంతో మంచు లక్ష్మీ కాజల్ కు పార్టీ ఇవ్వాలంటూ సరదాగా వార్నింగ్ ఇచ్చారు.
దగ్గుబాటి రానా యూట్యూబ్ ఛానల్ సౌత్ బే లో మంచు లక్ష్మీకి ఒక షోతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.మూడు రోజుల క్రితం షో ప్రీమియర్ టెలీకాస్ట్ అయింది.
షోలో మంచు లక్ష్మీ కాజల్ గురించి మాట్లాడుతూ కాజల్ తనకు మంచి స్నేహితురాలని.పెళ్లికి ముందు ఆమె పెళ్లికి సంబంధించి చాలా విషయాలను షేర్ చేసుకుందని.వైరస్ విజృంభణ, లాక్ డౌన్ వల్ల పార్టీలు అడగడం లేదని.పార్టీ ఇవ్వకుండా తప్పించుకొని కాజల్ చీప్ గా బిహేవ్ చేయవద్దని.సాధారణ పరిస్థితులు ఏర్పడ్డాక పార్టీ ఇవ్వాలని కాజల్ కు స్వీట్ వార్నింగ్ ఇచ్చినట్టు తెలిపారు.కాజల్ సెలబ్రిటీలకు పార్టీ ఇవ్వాలంటే మాత్రం వచ్చే ఏడాది వరకు ఆగాల్సిందే.
కాజల్ ప్రస్తుతం ఆచార్య, భారతీయుడు సినిమాలతో బిజీగా ఉన్నారు.ఈ సినిమాలు కాకుండా కాజల్ చేతిలో మరికొన్ని ఛాన్సులు కూడా ఉన్నాయి.కాజల్ ఆచార్య షూటింగ్ లో జాయిన్ కాగానే కొన్ని కీలకమైన సన్నివేశాలతో పాటు పాటలను చిత్రీకరించనున్నారని సమాచారం.