ఈ మధ్య కాలంలో మంచు మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మీ సోషల్ మీడియాలో తెగ యాక్టివ్ గా ఉంటున్నారు.తరచూ సోషల్ మీడియాలో మంచు లక్ష్మీ పోస్టులు పెడుతుండగా ఆ పోస్టులపై పాజిటివ్ కామెంట్ల కంటే ట్రోల్ చేసే వాళ్లే ఎక్కువ మంది ఉండటం గమనార్హం.
తాజాగా మంచు లక్ష్మీ కరోనా వల్ల ఇంటికే పరిమితమైన పురుషులకు ఒక సలహా ఇచ్చారు.ఆ సలహాపై కొందరు పాజిటివ్ గా స్పందిస్తుంటే ఎక్కువమంది నెగిటివ్ గా స్పందిస్తున్నారు.
ప్రస్తుతం దేశంలో ఒకరోజుకు 3 లక్షల నుంచి 4 లక్షల కరోనా కేసులు నమోదవుతున్నాయి.కరోనా భయం వల్ల ప్రజల్లో చాలామంది ఇంటికే పరిమితమవుతూ ఉన్నారు.కరోనా కంటే కరోనా సోకుతుందనే భయం వల్లే చాలామంది తెగ టెన్షన్ పడుతున్నారు.అలా టెన్షన్ పడుతున్న వాళ్లకు మంచు లక్ష్మీ ఉచిత సలహా ఇచ్చారు.
ఇంట్లో ఉన్నవాళ్లు తమ పెళ్లి వీడియోలు చూడాలని మంచు లక్ష్మీ చెప్పారు.
ఆ పోస్ట్ పై మంచు లక్ష్మీని నెటిజన్లు తెగ ట్రోల్ చేస్తున్నారు.
మంచు లక్ష్మీ పెళ్లి వీడియోలు ఉంటే పెట్టాలని ఆ వీడియోలను తాము చూస్తామని నెటిజన్లు కామెంట్లు చేస్తుండటం గమనార్హం.మంచు లక్ష్మీ పోస్టులు ఈ మధ్య కాలంలో తెగ ట్రోలింగ్ కు గురవుతున్నా ఆమె మాత్రం వరుస పోస్టులు చేస్తూ వార్తల్లో నిలుస్తుండటం గమనార్హం.
కొన్నిరోజుల క్రితం కేటీఆర్ ను ఉద్దేశిస్తూ బ్లాక్ కాఫీ గురించి పోస్టులు పెడుతూ మంచు లక్ష్మీ వార్తల్లో నిలిచారు.
ఒకవైపు ప్రజలు కరోనా వల్ల కష్టాలు పడుతున్న తరుణంలో మంచు లక్ష్మీ పెడుతున్న పోస్టులు కొంతమంది నెటిజన్లకు చిరాకు తెప్పిస్తున్నాయి.నెటిజన్ల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో మంచు లక్ష్మీ నెగిటివ్ కామెంట్స్ విషయంలో ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది.