బుల్లితెరలో మంచి క్రేజ్ ను సంపాదించుకున్న సీరియల్ కార్తీకదీపం.ఈ సీరియల్ రేటింగ్ విషయంలో కూడా మొదటి స్థానంలో ఉంది.
తెలుగు రాష్ట్రాలలో ఈ సీరియల్ కు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది.ప్రస్తుతం ఈ సీరియల్ కాస్త కొత్తదనాన్ని పరిచయం చేసింది.
దీంతో ప్రేక్షకులంతా ఈ సీరియల్ సమయం కంటే ముందే టీవీల ముందు వాలిపోతున్నారు.
ఇదిలా ఉంటే ఈ సీరియల్ లో ప్రస్తుతం దీప అనారోగ్య సమస్యతో బాధ పడుతున్న సంగతి తెలిసిందే.
దీంతో కార్తీక్ దీప ఇక బ్రతకదని తెలిసి తన కోసం ఎంతో చేస్తుంటాడు.ఇక తాజాగా దీప మాతృత్వం గురించి నిజం తెలిసిన కార్తీక్ తనని ఎంతో బాధ పెట్టాను అంటూ దీప కోసం బాగా ఏడుస్తాడు.
ఇక ఈ సీరియల్ గురించి మంచు లక్ష్మి ఓ ఆసక్తికరమైన కామెంట్ చేసింది.
ప్రస్తుతం మంచు లక్ష్మీ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.అంతేకాకుండా ఈ ట్వీట్ ను చూసిన నెటి జనులు రక రకాలుగా స్పందిస్తున్నారు.
మీరు కూడా వంటలక్క అభిమానేనా లక్ష్మీ గారు అంటూ తెగ కామెంట్స్ చేస్తున్నారు.ఇక ఈ ట్వీట్ కు స్పందించిన డాక్టర్ బాబు కూడా మంచు లక్ష్మికి థాంక్స్ చెప్పాడు.