మంచు లక్ష్మి మరోసారి ఫిల్మ్ఫేర్ అవార్డును సొంతం చేసుకుంది.గత సంవత్సరం ‘గుండెల్లో గోదారి’ సినిమాకు గాను ఉత్తమ సహాయ నటిగా అవార్డును దక్కించుకున్న ఈమె తాజాగా ఈ సంవత్సరంకు గాను ‘చందమామ కథలు’ సినిమాకు గాను ఉత్తమ సహాయ నటిగా మరోసారి అవార్డును దక్కించుకుని అందరి దృష్టిని ఆకర్షించింది.
వరుసగా రెండు ఉత్తమ సహాయ నటి అవార్డు రావడంతో మంచు లక్ష్మి ఉబ్బి తబ్బిబవుతోంది.తాజాగా జరిగిన 62వ ఫిల్మ్ ఫేర్ అవార్డు వేడుకలో మంచు లక్ష్మి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఇటీవలే ఈమె నటించిన ‘చందమామ కథలు’ సినిమాకు జాతీయ స్థాయిలో అవార్డు వచ్చింది.తాజాగా అదే సినిమాలో నటించిన మంచు లక్ష్మికి ఫిల్మ్ఫేర్ అవార్డు రావడంతో చిత్ర యూనిట్ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే ‘చందమామ కథలు’ సినిమాకు పలు అవార్డులు, రివార్డులు వచ్చాయి.తాజాగా మరోసారి ఫిల్మ్ ఫేర్లో అవార్డు రావడంతో సంతోషంగా ఉందని దర్శకుడు ప్రవీణ్ సత్తారు అంటున్నాడు.
ఇక మంచు లక్ష్మి వచ్చే సారి కూడా ఫిల్మ్ ఫేర్ అవార్డును అందుకుని హ్యాట్రిక్ కొట్టాలని ఇప్పటి నుండే ఆమె సన్నిహితులు మరియు అభిమానులు, కుటుంబ సభ్యులు కోరుకుంటున్నారు.