టాలీవుడ్లో మల్టీ ట్యాలెంటెడ్ పర్సన్లు చాలా తక్కువ మంది ఉన్నారు.వారిలో మంచి లక్ష్మి ఒకరు.
ఈమె నిర్మాత, నటిగా, యాంకర్గా మరెన్నో రకాల పాత్రలు పోషిస్తూ అందరిని ఆశ్చర్యపర్చుతోంది.ఈమె తన సొంత నిర్మాణ సంస్థలో ఇప్పటికే గుర్తింపు తెచ్చే సినిమాలు చేసింది.
ఇక తాజాగా ఈమె నిర్మాతగా ‘దొంగాట’ అనే సినిమా తెరకెక్కబోతుందనే వార్తలు వచ్చాయి.మంచు ఎంటర్టైన్మెంట్స్లో ఈ సినిమా టైటిల్ను రిజిస్టర్ చేయించడం జరిగింది.
దాంతో ఆ సినిమాలో ఎవరు నటిస్తారనే ఆసక్తి నెలకొంది.
తాజాగా ఆ విషయంపై ఒక క్లారిటీ వచ్చింది.
‘దొంగాట’ చిత్రంలో మంచు లక్ష్మి ప్రాధాన పాత్రలో నటించనుంది.అలాగే హీరోగా అడవి శేషు నటించనున్నాడని తెలుస్తోంది.
ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్న ఈ చిత్రం అతి త్వరలో సెట్స్ పైకి వెళ్లబోతుంది.ఈ చిత్రానికి కొత్త దర్శకుడు వంశీ కృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.
ఇక ఈ చిత్రంలో యువ హీరో రానా ఒక ముఖ్యమైన అతిథి పాత్రలో నటించబోతున్నాడు.క్రైమ్ కామెడీ సినిమాగా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లుగా తెలుస్తోంది.
మంచు లక్ష్మికి ఇప్పటి వరకు నిర్మాతగా కమర్షియల్ సక్సెస్ వచ్చింది లేదు.మరి ఈ సినిమా అయినా ఈమెకు సక్సెస్ను తెచ్చి పెడుతుందో చూద్దాం.