సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య వ్యవహారం ఇప్పుడు దేశ వ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది.మహారాష్ట్ర పోలీసులు ఈ కేసు విచారణలో చాలా నిజాలు దాచే ప్రయత్నం చేశారని సీబీఐ ఎంక్వయిరీలో బయటపడుతుంది.
ఇక ఈ ఆత్మహత్య వ్యవహారంలో డ్రగ్స్ చాలా కీలకంగా మారాయి.సుశాంత్ డ్రగ్స్ తీసుకునేవాడనే నిజాలు బయటకి వచ్చాయి.
అదే సమయంలో సుశాంత్ కి డ్రగ్స్ ఇవ్వడం కోసం అతని ప్రియురాలు రియా చక్రవర్తి, ఆమె తమ్ముడు డ్రగ్స్ డీలర్స్ తో సంబంధాలు కొనసాగించారు అని విచారణలో ఆధారాలు లభించాయి.వీరు డ్రగ్స్ డీలర్స్ తో చాటింగ్ చేసిన మెసేజ్ లు లభించడంతో పాటు రియా చక్రవర్తి కూడా విచారణలో అంగీకరించడంతో నార్కోటిక్ కంట్రోల్ బోర్డు అధికారులు ఆమెని అరెస్ట్ చేశారు.
ఆమె ఇంట్లో సోదాలు నిర్వహించి కీలక ఆధారాలు కూడా సేకరించారు.
ఇదిలా ఉంటే రియా చక్రవర్తి విషయంలో మీడియా ఎక్కువ శ్రద్ధ చూపిస్తుంది.
సుశాంత్ ఆత్మహత్యలో ఆమెని దోషిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నాయని చాలా మంది భావిస్తున్నారు.గతంలో మంచు లక్ష్మి కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేసింది.
అయితే తాజాగా ఆమె పెట్టిన పోస్టు నెటిజన్లు ఆగ్రహానికి కారణం అవుతుంది.రియాకి ఆమె మద్దతుగా నిలుస్తూ దేశంలో కరోనాపై ఉన్న ఆసక్తి కంటే సుశాంత్ ఆత్మహత్య కేసుపైనే ఎక్కువ ఆసక్తి నెలకొందని ఒక పిక్చర్ షేర్ చేసింది.
అయితే సుశాంత్ ఆత్మహత్య వెనుక చాలా రహస్యాలు దాగి ఉన్నాయని, అలాంటి సమయంలో తెలుసుకోవాలనే ఆసక్తి చాలా మందికి ఉంటుంది.అయితే సుశాంత్ ఆత్మహత్య అసలు మాటర్ కాదు అన్నట్లు ఆమె పోస్ట్ చేయడం కరెక్ట్ కాదని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
రియాకి అండగా ఉండాలనే ప్రయత్నంలో ఆమె సుశాంత్ మరణాన్ని తక్కువ చేస్తుందని, ఆమె కూడా నెపోటిజంలో ఉన్న కొమ్మే కదా అంటూ విమర్శలు చేస్తున్నారు.అయితే మంచు లక్ష్మి ఈ విమర్శలపై ఎలా రియాక్ట్ అవుతుంది అనేది చూడాలి.