తెలుగు సినీ పరిశ్రమ నటుడు మోహన్ బాబు గురించి, ఆయన నటన గురించి అందరికి తెలిసిందే.అంతే కాకుండా తమ కుటుంబం మొత్తం సినీ పరిశ్రమలో అడుగు పెట్టి మంచి గుర్తింపు సాధించుకున్నారు.
మోహన్ బాబు కూతురు నటి మంచు లక్ష్మి ఇటీవలే తన తండ్రికి సర్ ప్రైజ్ చేయగా.ప్రస్తుతం వాటికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఎప్పుడూ బిజీగా ఉండే తమ లైఫ్ లో ఏదైనా కొత్తగా చూపించాలని నటి మంచు లక్ష్మి తన తండ్రితో పాటు, తన తల్లిని, తన కుటుంబంతో కలిసి వెకేషన్ కోసం మాల్దీవులకు వెళ్లారు.ఈ విధంగా మంచు లక్ష్మి కొన్ని విషయాలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో తెలుపుతూ.” గత రాత్రి బీచ్ లో విందు ఏర్పాటు చేస్తూ మా నాన్నకు సర్ ప్రైజ్ చేశాను.
అంతేకాకుండా మా నాన్న నటించిన సినిమాలలో పాటలు వింటూ, సముద్ర అందాలను ఆనందంగా తిలకిస్తూ, ఇష్టమైన ఆహారం తీసుకుంటూ, మా కోసం మేము ఓ ప్రత్యేకమైన సమయాన్ని గడిపాము.ఇలా కుటుంబంతో గడిపి చాలా రోజులుగా ఈ క్షణం నాకు ఎంతో సంతోషాన్ని అందించింది” అని తెలిపింది.కాగా మంచు లక్ష్మి తమ కుటుంబ సభ్యులతో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.
ఓ వీడియోను కూడా షేర్ చేయగా ప్రస్తుతం వైరల్ గా మారింది.
నటి మంచు లక్ష్మి సోషల్ మీడియాలో బిజీగా ఉంటూ ప్రేక్షకులకు కొన్ని కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుపుతూ ఉంటుంది.
ప్రస్తుతం మోహన్ బాబు సన్ ఆఫ్ ఇండియాలో నటిస్తున్నారు.అంతేకాకుండా హిందీలో విజయం సాధించిన లవ్ స్టోరీస్ ను తెలుగులో పిట్టకథలు అనే పేరుతో రీమేక్ చేస్తున్నారు.
కాగా ఈ సినిమాలో మంచు లక్ష్మి ఓ ప్రత్యేకమైన పాత్రలో నటిస్తుంది.ఈ సినిమాను త్వరలోనే నెట్ ఫ్లిక్స్ ద్వారా ప్రేక్షకులకు చూపించనున్నారు.