టాలీవుడ్ స్టార్ నటుడు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కూతురుగా టాలీవుడ్ లో అందరికి పరిచయం అయ్యి తరువాత నటిగా, వాఖ్యాతగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని సొంతం చేసుకున్న నటి మంచు లక్ష్మి.ఆమె అమెరికన్ తెలుగు ఉచ్చారణకి విశేషమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
అయితే తనపై వచ్చే ట్రోల్స్ ని కూడా మంచు లక్ష్మి చాలా పాజిటివ్ గా తీసుకుంటుంది.నటిగా సినిమాలు చేస్తున్న ఈ అమ్మడుకి అనుకున్న స్థాయిలో సక్సెస్ రావడం లేదు.
దీంతో చాలా కాలంగా సినిమాలకి దూరంగా ఉంది.అయితే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అప్పుడప్పుడు సోషల్ అవేర్ నెస్ పోస్టులు పెడుతుంది.
ఇదిలా ఉంటే తాజాగా మంచు లక్ష్మి ఓ ఇంటర్వ్యూలో కాస్తా మనసు విప్పి మాట్లాడింది.
బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమీర్ ఖాన్ అంటే తనకు చాలా ఇష్టం అని మంచు లక్ష్మి ఈ ఇంటర్వ్యూలో పేర్కొంది.
ఆయనకి పెళ్లి అయినప్పుడు ఏడ్చేసానని తెలిపింది.ఇక ఆమీర్ ఖాన్ రెండో సారి పెళ్లి చేసుకునే సమయంలో కూడా ఏడ్చేశా అని తెలిపింది.అవకాశం దొరికితే అతనిని పెళ్లి చేసుకోవాలని అనుకున్నానని కూడా తెలిపింది.ఇక అమీర్ ఖాన్ సినిమాలు సెలక్ట్ చేసుకునే విధానం, తనను ఎంతగానో ఆకట్టుకుంటుందని మంచు లక్ష్మీ చెప్పుకొచ్చింది.
మొత్తానికి బాలీవుడ్ మిస్టర్ పెర్ఫెక్ట్, విలక్షణ నటుడు అమీర్ ఖాన్ మంచు లక్ష్మి మనసుని తన టాలెంట్ తో దోచేశాడనే విషయం ఆమె మాటల బట్టి అర్ధమైంది.అలాగే టాలీవుడ్ లో నాగార్జున అంటే ఇష్టం అని మంచు లక్ష్మి పేర్కొంది.