తెలుగు ఇండస్ట్రీలో చాలా కాలంగా కాస్టింగ్ కౌచ్, లైంగిక వేధింపులకి సంబందించిన వార్తలు వినిపిస్తున్నాయి.చాలా మంది తారలు వీటిపై తమ గళం విప్పుతున్నారు.
ముఖ్యంగా తెలుగు అమ్మాయిలకి అవకాశాలు రాకపోవడానికి కారణం ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ కి సహకరించకపోవడం అనే మాట బలంగా వినిపిస్తుంది.తాజాగా హాట్ బ్యూటీ తేజస్వీ మదివాడ కూడా ఇదే విషయం చెప్పింది.
చాలా మంది తనని పక్కలోకి పిలిచారని చెప్పుకొచ్చింది.ఇండస్ట్రీలో మెజారిటీ వర్గం నుంచి లైంగిక వేధింపులు ఉన్నాయని స్పష్టం చేసింది.
ఇదిలా ఉంటే తాజాగా మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి ఇండస్ట్రీలో మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులని అడ్డుకోవడానికి చేస్తున్న ప్రయత్నం గురించి మీడియాతో పంచుకుంది.
మీటూ ఉద్యమం తర్వాత చాలా మందిలో భయాలు మొదలయ్యాయని సినీ నటి మంచు లక్ష్మి అన్నారు.
అయితే, వేధింపులపై గళం విప్పిన చాలా మంది మహిళలకు ఇప్పటికీ న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు.తాను, స్వప్న దత్, సుప్రియ, నందిని, ఝాన్సీ ఐదుగురం కలిసి ఇండస్ట్రీలో మహిళలపై జరుగుతున్న వేధింపులపై పోరాడుతున్నామని చెప్పారు.
భవిష్యత్తులో టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ అనే మాట వినపడకుండా కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.ఇండస్ట్రీలో ఆడవాళ్ళు తమకి ఎదురైనా అనుభవాలని నేరుగా తమతో వచ్చి చెప్పుకోవచ్చని ఆమె సూచించారు.
తాను కోరుకున్న పాత్రలు రావడం లేదని అందుకే ఈ మధ్య సినిమాలు చేయడం లేదని మంచు లక్ష్మి చెప్పుకొచ్చింది.