తెలుగు సినీ నటి, డైలాగ్ కింగ్ మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి పేరు వింటే చాలు వెంటనే ఆమె మాట్లాడే భాష, ఆమె వాడే పదాలు గుర్తుకు వస్తుంటాయి.ఈమె మంచు ఫ్యామిలీ నుండి తొలి హీరోయిన్ గా పరిచయం అయింది.
కానీ ఇండస్ట్రీలో ఎక్కువ కాలం నిల్వలేకపోయింది.నిర్మాతగా కూడా బాధ్యతలు చేపట్టింది.
సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ బిజీగా కనిపిస్తుంది మంచు లక్ష్మి.ఇదిలా ఉంటే తాజాగా నిమ్మ పండు, నిమ్మకాయకు తేడా చెప్పి ట్రోల్స్ ఎదుర్కొంటుంది.
మొదట ఇంగ్లీష్ సినిమాతో ఇండస్ట్రీలో అడుగు పెట్టింది.ఆ తర్వాత అనగనగా ఓ ధీరుడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.అలా పలు సినిమాలలో నటించిన కూడా అంత సక్సెస్ అందుకోలేకపోయింది.బుల్లితెరపై కూడా పలు షోలలో హోస్టింగ్ చేసింది.
ఇదిలా ఉంటే తాజాగా ఆహా లో కూడా ఓ వంటల ప్రోగ్రాం కు కూడా హోస్టింగ్ చేస్తుంది.ఆహా లో ఇటీవలే ఆహా భోజనంబు అంటూ ప్రారంభించిన ఈ షోలో ఇప్పటివరకు పలు ఎపిసోడ్ లు పూర్తయ్యాయి.
ఇదిలా ఉంటే అప్పుడప్పుడు ఈమె చేసే కొన్ని కామెంట్లు నెట్టింట్లో బాగా వైరల్ గా మారుతూ ఉంటాయి.అంతేకాకుండా బాగా ట్రోల్స్ కూడా ఎదుర్కొంటుంది.ఇదిలా ఉంటే తాజాగా తాను చేసిన కామెంట్ వల్ల ప్రస్తుతం నెట్టింట్లో బాగా వైరల్ గా మారింది. ఎల్లో కలర్ లో ఉండేది నిమ్మపండుగ్రీన్ కలర్ లో ఉండేది నిమ్మకాయ అంటూ తెలుపగా.
ఈ మాటకు ఇదేమి డిఫరెన్స్ రా బాబు నేనెప్పుడూ వినలేదు రా బాబు అంటూ ట్రోలింగ్ నడుస్తుంది.ఇక మరికొందరు ఈ విషయం గురించి ఎక్కడ తెలుసుకున్నావు తల్లి అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ప్రస్తుతం ఆమె ఎదుర్కొంటున్న ట్రోలింగ్స్ నెట్టింట్లో బాగా వైరల్ గా మారింది.