యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రాధేశ్యామ్ సినిమాతో పాటు నాగ అశ్విన్ తెరకెక్కిస్తున్న సినిమాలో కూడా నటిస్తున్నారన్న సంగతి అందరికీ విధితమే.అయితే మంగళవారం సాయంత్రం బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ ప్రభాస్ తో కలిసి సినిమా తీస్తున్నానని మూవీ పోస్టర్ కూడా విడుదల చేసి అభిమానులకు తీపి కబురు అందించారు.
అయితే ఈ సినిమా పేరు ఆదిపురుష్ కాగా… ఇది పౌరాణిక కథ నేపథ్యంలో తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది.
ప్రభాస్ శ్రీ రాముడి పాత్రలో కనిపించనున్నారని ఇప్పటివరకు వార్తలు వెల్లువెత్తాయి.
కాగా ఆదిపురుష్ సినిమా గురించి ప్రేక్షకులతో పాటు సెలబ్రిటీలు కూడా బాగా చర్చించుకుంటున్నారు.ఈ క్రమంలోనే కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కూతురు నటీమణీ, బుల్లితెర యాంకర్ లక్ష్మీ మంచు కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
‘శూర్పణఖ పాత్రలో నటించేందుకు మంచు లక్ష్మిని ఎంపిక చేసుకోవాల్సిందిగా దర్శకుడు ఓం రౌత్ కి నేను సూచిస్తున్నాను,’ అని ఒక ట్విట్టర్ యూసర్ పోస్ట్ పెట్టారు.అయితే ఈ పోస్ట్ పై స్పందించిన మంచు లక్ష్మి ‘నిజంగానా?, ఎక్కడ సంతకం చేయాలి?, ‘ అంటూ ఆదిపురుష్ సినిమాలో నటించాలన్న ఆసక్తిని తాను కనబరిచారు.
ఇకపోతే ఆదిపురుష్ మూవీ ప్రభాస్ కు మొట్టమొదటి స్ట్రెయిట్ హిందీ ఫిలిం కాగా… బాలీవుడ్ నిర్మాత భూషణ్ కుమార్ తో ఇది తన మూడవ సినిమా.భూషణ్ కుమార్ నిర్మాణంలో సాహో సినిమా తెరకెక్కిందన్న విషయం విదితమే.ప్రస్తుతం అతని నిర్మాణంలోనే రాధేశ్యామ్ సినిమా కూడా తెరకెక్కుతుంది.
“ఆదిపురుష్ సినిమాలో ప్రతి పాత్ర చాలా క్లిష్టతరం గా ఉంటుంది.ఆదిపురుష్ సినిమాలో నటించాలంటే ఎంతో బాధ్యతాయుతంగా ఉంటూ ప్రతి సవాల్ ని ఎదుర్కోవాల్సి ఉంటుంది.భారతదేశ సినీ ప్రేక్షకులంతా మా సినిమాపై ప్రేమ ఆదరణ చూపిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను,” అని ప్రభాస్ చెప్పుకొచ్చారు.
ఆదిపురుష్ సినిమా త్రీడీ యాక్షన్ డ్రామాగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది.