టాలీవుడ్ లో విలక్షణ నటుడుగా డైలాగ్ కింగ్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని మంచు మోహన్ బాబు సొంతం చేసుకున్నాడు.ఇక అతని వారసులుగా మంచు లక్ష్మి, మనోజ్, విష్ణు టాలీవుడ్ లో నటులుగా ప్రూవ్ చేసుకున్న సక్సెస్ కొట్టడానికి మాత్రం యుద్ధమే చేస్తున్నారు.
విష్ణు, మనోజ్ కంటే లక్ష్మి నటిగా తనని తాను ప్రూవ్ చేసుకొని ఓ వైపు యాక్టర్ గా, మరో వైపు టెలివిజన్ పై వ్యాఖ్యతగా రెండు పాత్రలలో సూపర్ అనిపించుకుంది.అయితే ఆమె మాట్లాడి ఇంగ్లీష్ స్లాంగ్ తెలుగు చాలా మందికి ఫన్నీగా ఉంటుంది.
అయిన కూడా ఆమె స్పష్టమైన తెలుగు మాట్లాడటానికి ప్రయత్నం చేస్తూనే ఉంటుంది.అయితే అప్పుడప్పుడు మంచు ఫ్యామిలీ వారి మాటలతో ఆమె వార్తల్లో నిలుస్తుంది.
తాజాగా మంచు లక్ష్మి అన్న ఒక మాట సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పాటు నెటిజన్లు నుంచ ట్రోల్స్ కి కారణం అవుతుంది.మంచు ఫ్యామిలీకి తిరుపతికి మంచి అనుబంధం ఉంది.
అదే వారి సొంత ప్రాంతం, అక్కడ మంచు మోహన్ బాబు ఒక విద్యాలయం కూడా ఏర్పాటు చేశారు.ఈ నేపధ్యంలో మంచు లక్ష్మి చిన్నప్పటి నుంచి తరుచుగా తిరుపతి వెంకన్న దర్శనం కోసం వెళ్తుంది.
ఓ ఇంటర్వ్యూలో తిరుమల వెంకన్నపై ఆసక్తికరమైన కామెంట్స్ చేసింది.నేను ఎక్కువగా వెళ్ళేది తిరుమల దర్శనానికి మాత్రమే అని చెప్పింది.
అక్కడికి వెళ్తే మా పెదనాన్న దగ్గరకి వెళ్ళినట్లు ఉంటుందని మరో ఆసక్తికరమైన కామెంట్ చేసింది.ఈ కామెంట్ తో ఇప్పుడు నెటిజన్స్ ట్రోల్స్ కి కారణం అయ్యింది.
మంచు లక్ష్మి వాఖ్యలపై సోషల్ మీడియాలో భిన్నమైన కామెంట్స్ వినిపిస్తున్నాయి.మరి ఈ కామెంట్స్ మీద ఈ మంచు అమ్మాయి స్పందిస్తుందా లేదా అనేది వేచి చూడాలి.