అప్పుడప్పుడు సెలబ్రెటీలు షాక్ ల మీద షాక్ లు ఇస్తుంటారు.ఇప్పుడు సోషల్ మీడియా అందుబాటులో ఉండటంతో కొన్ని కొన్ని సార్లు తము షేర్ చేసే స్టోరీలతో, తాము పంచుకునే కొన్ని మాటలతో బాగా షాక్ లు ఇస్తుంటారు.
అయితే తాజాగా మంచు లక్ష్మి కూడా తన స్టోరీ తో పెద్ద షాక్ ఇచ్చింది.ఇంతకు అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం.
టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన మంచు లక్ష్మి గురించి అందరికి తెలిసిందే.ఆమె ఒక నటిగా కంటే వ్యక్తిగతంగా పరిచయాన్ని పెంచుకుంది.తెలుగులో పలు సినిమాలలో నటించి తనకంటూ ఓ గుర్తింపు సొంతం చేసుకుంది.కానీ ఇండస్ట్రీలో నటిగా ఎక్కువ కాలం నిల్వలేకపోయింది.
ఇక వెండితెరపైనే కాకుండా బుల్లితెరపై కూడా పలు షోలలో వ్యాఖ్యతగా చేసింది.
అంతేకాకుండా ఓటీటీ వేదికగా ఆహా లో ఓ వంటల షో కూడా చేసింది.
ఇందులో మొత్తం సెలెబ్రేటిలతోనే వంటలు చేయించింది.ఇక ఈమె ఎక్కడైనా ఇంటర్వ్యూ లలో లేదా ఈవెంట్ లలో పాల్గొంటే చాలు ఆ వేదిక మొత్తం తన తెలుగు బాషాతో బాగా సందడిగా మారుతుంది.
ఎందుకంటే తను మాట్లాడే తెలుగు బాషా గురించి అందరికి తెలిసిందే.
తన భాషతో ఇప్పటికే చాలా సార్లు ట్రోల్స్ ఎదురుకుంది.అంతేకాకుండా కొందరి సెలబ్రేటిలకు పలు వేదికలపై తన బాషా గురించి వివరణ కూడా ఇచ్చింది.ఇక ఈమె సోషల్ మీడియా లో బాగా యాక్టీవ్ గా ఉంటుంది.
తనకు సంబంధించిన వ్యక్తిగత విషయాలను కూడా బాగా షేర్ చేసుకుంటుంది.ఇక కొన్ని రోజుల కిందట యూట్యూబ్ లో కూడా తన పేరు మీద ఛానల్ క్రియేట్ చేసుకొని అందులో చాలా విషయాలు పంచుకుంది.
తన హోమ్ టూర్ వీడియోలను తన కూతురి వీడియోలను కూడా బాగా పంచుకుంటుంది.తను వర్క్ అవుట్ లు కూడా బాగా చేస్తూ ఉంటుంది.వాటికి సంబంధించిన వీడియోలను కూడా షేర్ చేసుకుంటుంది.ప్రస్తుతం పలు సినిమాలలో బాగా బిజీగా ఉంది.
ఇక అప్పుడప్పుడు ఈమె షేర్ చేసే కొన్ని పోస్టులు బాగా వైరల్ అవుతూ ఉంటాయి.
అయితే తాజాగా ఈమె షేర్ చేసిన ఒక స్టోరీ కూడా బాగా వైరల్ అయింది.తాజాగా తన ఇన్స్టా వేదికగా ఒక ఫుడ్డుకు సంబంధించిన ఫోటో పంచుకుంది.అయితే ఆ ఫోటోకు మ్యారి మీ అంటూ అనగా నన్ను పెళ్లి చేసుకో అంటూ క్యాప్షన్ ఇచ్చింది.
ప్రస్తుతం ఆ స్టోరీ వైరల్ అవ్వగా ఇదేంటి లక్ష్మి ఇలా పోస్ట్ చేసింది అంటూ ఆశ్చర్యపోతున్నారు నెటిజన్స్.మరికొంతమంది తినే పదార్థమును పెళ్లి చేసుకోమని అడగటం ఏంటి ఈమెకు ఏమైనా పిచ్చెక్కిందా అంటూ బాగా ట్రోల్స్ చేస్తున్నారు.
ప్రస్తుతం ఆ స్టోరీ బాగా వైరల్ అవుతుంది.