తెలుగు సినిమా ఇండస్ట్రీ విలక్షణ నటుడు మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి మరోసారి తన మంచి మనసును నిరూపించుకునేందుకు పేద దివ్యాంగుల కోసం అండగా నిలబడింది.ఈ ఏడాది క్రీడలలో రాణించాలని ఉన్న పేద దివ్యాంగుల కోసం ఆదిత్య మెహతా ఫౌండేషన్ ఆధ్వర్యం అనే సంస్థ ద్వారా శిక్షణ ఇస్తూ, ఈ కార్యక్రమంలో భాగంగానే వారి కోసం నిధులు సేకరించడంతో పాటు మంచు లక్ష్మి సైకిల్ పై 100 కిలో.
మీటర్లు సైక్లింగ్ చేసింది.
ఈ కార్యక్రమాన్ని ఆదివారంతో ముగింపు పలికింది మంచు లక్ష్మి.
ఈ కార్యక్రమంలో భాగంగానే సైక్లింగ్ పై దాదాపు 5 లక్షల రూపాయలు ఫౌండేషన్ కు అందచేయాలని నిర్ణయించుకుని మంచు లక్ష్మి ముందుకు కొనసాగింది.వాస్తవానికి పారా సైక్లింగ్ అంతర్జాతీయంగా, జాతీయంగా పథకాలను సొంతం చేసుకున్న ఆదిత్య ఆధ్వర్యంలో ఈ ఫౌండేషన్ నడుస్తున్నట్లు సమాచారం.
అంతేకాకుండా ఈ ఫౌండేషన్ కు గత 6 సంవత్సరాలుగా మంచు లక్ష్మి సేవలు అందించడంతో పాటు వారి యోగక్షేమాలను చూస్తుంది.అలాగే ప్రస్తుతం ఎదురు సమీకరణలో తన వంతు ప్రయత్నంగా 100 కిలోమీటర్ల సైక్లింగ్ పూర్తి చేసుకుంది.
ఈ సందర్బంగా మంచు లక్ష్మి మాట్లాడుతూ.” ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కోరడం జరిగింది.మీకు కూడా మీకు నచ్చినంత సహాయం చేయాలని మంచు లక్ష్మి ప్రజలను కోరారు.ప్రస్తుతం మంచు లక్ష్మి సైకిల్ ఫోటోలను సోషల్ మీడియాలో తాజాగా షేర్ చేయడం, అది కాస్త వైరల్ గా చక్కర్లు కొడుతున్నాయి.
ఏది ఏమైనా మన టాలీవుడ్ లో ఉన్న కొందరు ప్రముఖులు మంచి పనులు చేయడానికి కాస్త ముందుంటారని చెప్పవచ్చు.కరోనా కష్టకాల సమయంలో సినీ వర్గానికి సంబంధించిన అనేక మంది కార్మికులను కాపాడేందుకు ఎంతో మంది హీరో హీరోయిన్లు వారి వంతు సహాయాన్ని అందించి వారిని ఆర్థిక సంక్షోభం నుంచి కాపాడడానికి ప్రయత్నం చేశారు.