సుశాంత్ ఆత్మహత్య వ్యవహారం ఇప్పుడు చిలికి చిలికి గాలివానలా మారిపోయింది.ఈ కేసులో సుశాంత్ కుటుంబ సభ్యులు అందరూ రియాని టార్గెట్ చేస్తున్నారు.
రియానే తన కుమారుడుని చంపింది అంటూ సుశాంత్ తండ్రి నేరుగా ఆరోపణలు చేస్తున్నారు.అయితే ఆ ఆరోపణలు పక్కన పెడితే సుశాంత్ ఫ్యాన్స్ ముసుగులో చాలా మంది రియాని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.
మీడియా కూడా రియా చక్రవర్తిని టార్గెట్ చేస్తూ వార్త కథనాలు ప్రసారం చేస్తుంది.తప్పంతా ఆమె వైపు ఉందనే విధంగా ప్రొజెక్ట్ చేస్తుంది.
అయితే ఈ కేసు విచారణ చేపడుతున్న సీబీఐ మాత్రం రియా చక్రవర్తిని విచారిస్తున్నారు.అయితే మీడియాలో ఈ విచారణ ఎలా జరిగింది అనే విషయాన్ని కూడా తోచిన విధంగా రాసేస్తున్నాయి.
ఓ విధంగా రియా చక్రవర్తితో పాటు, ఆమె కుటుంబం మొత్తాన్ని సుశాంత్ వ్యవహారంలో ట్రోల్ చేస్తూ దోషిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు.ఈ నేపధ్యంలో రియా చక్రవర్తి ప్రముఖ జర్నలిస్ట్ రాజ్ దీప్ సర్దేసాయ్ ఇంటర్వ్యూలో తనపై జరుగుతున్న మానసిక దాడి గురించి చెబుతూ ఆవేదన వ్యక్తం చేసింది.
ఈ ఇంటర్వ్యూపై మంచు లక్ష్మి తన అభిప్రాయాన్ని ట్విట్టర్ ద్వారా షేర్ చేసింది.
రియా పూర్తి ఇంటర్వ్యూ చూశాను.
నేను దీనిపై స్పందించాలా వద్దా అనే దాని గురించి చాలా ఆలోచించాను.నేను చాలా మంది సైలెంటుగా ఉండటం చూస్తున్నాను.
ఎందుకంటే మీడియా ఒక అమ్మాయిని ఒక రాక్షసిగా చేసింది.నాకు నిజం తెలియదు.
కానీ నేను సత్యాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాను.నిజం చాలా నిజాయితీగా బయటకు వస్తుందని నేను ఆశిస్తున్నాను.
న్యాయ వ్యవస్థపై మరియు సుశాంత్ కు న్యాయం చేయడంలో పాలుపంచుకున్న అన్ని ఏజెన్సీలపై నాకు పూర్తి నమ్మకం ఉంది.కానీ అప్పటి వరకు మనం నిజాలు తెలియకుండా ఆ వ్యక్తిని.
ఆమె కుటుంబం మొత్తాన్ని కించపరచకుండా ఉండొచ్చు.మీడియా ట్రయల్స్ అని పిలవబడే వాటితో కుటుంబం మొత్తం అనుభవిస్తున్న బాధను నేను ఊహించగలను.
ఇలాంటివి నాకు జరిగితే నా గురించి తెలిసిన నా కొలీగ్స్ ని నాకోసం నిలబడాలని నేను కోరుకుంటాను.నిజం అధికారికంగా వెల్లడయ్యే వరకు ఆమెను ఒంటరిగా వదిలేయండి.
మనం ఎలా మారిమనే దానితో నేను బాధపడుతున్నాను.మన స్వరం వినిపించాల్సి వచ్చినప్పుడు మనం హార్ట్ ఫుల్ గా మాట్లాడకపోతే మనం ఎలా ప్రామాణికం అవుతాము.
నేను నా కొలీగ్ కోసం నిలబడతాను” అని మంచు లక్ష్మి పోస్ట్ చేసింది.దీనిపై నెటిజన్లు నుంచి మద్దతు లభించింది.
ఈ నేపధ్యంలో జస్టిస్ ఫర్ రియా చక్రవర్తి అనే హ్యాష్ ట్యాగ్ ఇప్పుడు ట్రెండ్ అవుతుంది.