సీనియర్ నటుడు మోహన్ బాబు తనయ మంచు లక్ష్మి తాజాగా వంటలక్కగా మారిన సంగతి మనకు తెలిసిందే.ఓటీటీ ఫ్లాట్ ఫామ్ వేదిక అయినటువంటి “ఆహా” యాప్ ద్వారా “ఆహా భోజనంబు”అనే వంటల కార్యక్రమం ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి మనకు తెలిసిందే.
ఇప్పటికే ఆహా ద్వారా సమంత, రానా వివిధ షోల ద్వారా ప్రేక్షకులను ఎంతో సందడి చేశారు.ఈ క్రమంలోనే మంచు లక్ష్మి కూడా “ఆహా భోజనంబు” కార్యక్రమం ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.
ఇప్పటికే ఈ కార్యక్రమం రెండు ఎపిసోడ్లను పూర్తి చేసుకుంది.ఈ కార్యక్రమానికి ఇప్పటివరకు హీరో విశ్వక్ సేన్, హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ వచ్చి తమదైన శైలిలో వంటలు చేసే ప్రేక్షకులను ఎంతో సందడి చేశారు.తాజాగా ఈ కార్యక్రమానికి దర్శకుడు తరుణ్ భాస్కర్ వచ్చారు.ఈ క్రమంలోనే ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఈ ఫోటోలు వైరల్ గా మారాయి.
ఈ కార్యక్రమానికి వచ్చిన తరుణ్ భాస్కర్ వంట చేయడంతో పాటు ఎన్నో ఆసక్తికరమైన విషయాలను అభిమానులతో నటించడానికి సిద్ధమయ్యారు.ఈ కార్యక్రమానికి సంబంధించిన పూర్తి ఎపిసోడ్ ఆగస్ట్ 6 వ తేదీన ఆహా వీడియో లో స్ట్రీమ్ కానుంది. అదే విధంగా ఈ కార్యక్రమానికి మంచు విష్ణు, అఖిల్ అక్కినేని, ఆనంద్ దేవరకొండ వంటి సెలబ్రిటీస్ హాజరు కానున్నట్లు తెలుస్తోంది.ప్రస్తుతం తరుణ్ భాస్కర్ పాల్గొన్నటువంటి ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.